తిరుమల ఘాట్ రోడ్ : వేగంగా వెళ్తూ బోల్తాపడి రెయిలింగ్ ను ఢీకొట్టిన స్కార్పియో కారు, స్పల్పగాయాలతో బయటపడ్డ భక్తులు

|

Jan 10, 2021 | 3:07 PM

తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ఆదివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. స్వామివారి దర్శనం ముగించుకుని కొండపై నుంచి వేగంగా దిగుతోన్న స్కార్పియో..

తిరుమల ఘాట్ రోడ్ : వేగంగా వెళ్తూ బోల్తాపడి రెయిలింగ్ ను ఢీకొట్టిన స్కార్పియో కారు, స్పల్పగాయాలతో బయటపడ్డ భక్తులు
Follow us on

తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ఆదివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. స్వామివారి దర్శనం ముగించుకుని కొండపై నుంచి వేగంగా దిగుతోన్న స్కార్పియో కారు బోల్తా కొట్టి రెయిలింగ్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కర్ణాటకకు చెందిన భక్తులకు గాయాలయ్యాయి. కారులో భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు ప్రయాణిస్తుండగా అదృష్టవశాత్తూ తండ్రీ కొడుకులు క్షేమంగా బయటపడ్డారు. మహిళకు చిన్నపాటి గాయాలు కావడంతో ఆమెను తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.