Rural Telangana adopts Coronavirus: దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి మెల్లమెల్లగా పల్లెలకు పాకుతోంది. దీంతో పల్లె ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు మండలాలకు, గ్రామాలకు చెందిన వ్యక్తులు ఎన్నో పనుల నిమిత్తం నిత్యం హైదరాబాద్ కు వస్తుంటారు.
పెద్ద సంఖ్యలో ఇతర ప్రాంతాల ప్రజలు వచ్చి వెళుతున్నా.. ఆయా గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకొకపోవడంతో కరోనా వ్యాప్తి త్వరగా గ్రామాలలో విస్తరించేందుకు అస్కారం ఉందంటూ పలువురు అవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు గ్రామాలలోని ప్రజలు మాస్కులు లేకుండా తిరుగుతున్నా పట్టించుకునే వారు కరువైయ్యారు. ఇక సామాజిక దూరం సంగతి సరేసరి. గ్రామాలలోకి ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నవారిని కట్టడి చేసి 14 రోజుల పాటు హోమ్ కార్వంటైన్లో ఉంచితే కరోనా వ్యాప్తిని నివారించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read More:
నర్సులకు భారీ ఆఫర్లు.. విమానచార్జీలు.. 50 వేల జీతం..!
ఇంటర్ సెకండియర్ విద్యార్థులందరూ పాస్.. అందుబాటులో మెమోలు..!