గుడ్ న్యూస్: కరోనా పేషెంట్లకు ‘వ్యాక్సీన్’.. అత్యవసర పరిస్థితుల్లో 5 డోసులు..

| Edited By:

Jun 03, 2020 | 6:06 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. ఈ మహమ్మారి కట్టడికోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కనుగొనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి.

గుడ్ న్యూస్: కరోనా పేషెంట్లకు వ్యాక్సీన్.. అత్యవసర పరిస్థితుల్లో 5 డోసులు..
Follow us on

Remdesivir gets nod from CDCSO: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కనుగొనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ వ్యాధికి యాంటీ వైరల్ ఔషధం రెమిడీసివిర్ పని చేస్తున్నదని తేలడంతో, ఈ ఔషధం వాడేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. అయితే, అత్యవసర పరిస్థితుల్లో కేవలం ఐదు డోసులను మాత్రమే రోగులకు అందించాలని నిబంధన విధించింది.

వివరాల్లోకెళితే.. జూన్ 1 నుంచి అత్యవసర పరిస్థితుల్లో రెమిడీసివిర్ ను వినియోగించేందుకు అనుమతులు మంజూరు చేశాము. కేవలం ఐదు డోసులు మాత్ర‌మే ఇవ్వాలి.. అని డ్ర‌గ్ కంట్రోల‌ర్ జన‌ర‌ల్ ఆఫ్ ఇండియా ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్లడించింది. ఈ ఔషధాన్ని కరోనా వైరస్ సోకిన వారిపై ప్రయోగించగా, మెరుగైన ఫలితాలు కనిపించాయని, అందువల్లే దీన్ని అనుమతించామని కేంద్రం ప్రకటించింది.

కాగా, గత నెలలోనే అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ అత్యవసర పరిస్థితుల్లో రెమిడీసివిర్ వాడకాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే.