AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాళేశ్వరం వద్ద తగ్గిన గోదావరి వరద

ప్రాణహిత నుంచి వస్తున్న వరద ప్రవహాం నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. దీంతో కాళేశ్వరం, లక్ష్మీ బరాజ్‌కు గోదావరి నదీ ప్రవాహం తగ్గింది. గురువారం ఉదయం 61,9000 క్యూసెక్కులు ఉన్న ప్రవాహం...

కాళేశ్వరం వద్ద తగ్గిన గోదావరి వరద
Sanjay Kasula
|

Updated on: Sep 03, 2020 | 8:27 PM

Share

ప్రాణహిత నుంచి వస్తున్న వరద ప్రవహాం నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. దీంతో కాళేశ్వరం, లక్ష్మీ బరాజ్‌కు గోదావరి నదీ ప్రవాహం తగ్గింది. గురువారం ఉదయం 61,9000 క్యూసెక్కులు ఉన్న ప్రవాహం సాయంత్రానికి 49,6,300 క్యూసెక్కులకు చేరింది. అలాగే అన్నారం బరాజ్‌కు మానేరు, గోదావరి నది నుంచి 8,600 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తుండగా రెండు గేట్లు ఎత్తి 8,600 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.

బరాజ్‌లో ప్రస్తుతం 08.77 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. లక్ష్మీ బరాజ్‌లో 3.460 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు ఇంజినీరు అధికారులు వెల్లడించారు. ఎగువ నుంచి 4,96,300 ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండగా 75 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదలడంతో 4,96,300 ఔట్‌ఫ్లో వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.