క్యాష్ ఇన్ క్యాష్ ఔట్: ఇక కిరాణా షాపులే ఏటీఎం సెంటర్లు!

| Edited By:

Jun 06, 2019 | 3:52 PM

ఏటీఎంల సంఖ్య తగ్గుతూ వస్తోంది. కానీ ఏటీఎం వినియోగదారులు మాత్రం పెరిగిపోతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన నందన్ నిలేకని సారథ్యంలోని ఉన్నత స్థాయి కమిటీ సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. దీన్ని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (ఆర్‌బీఐ) కూడా తెలియజేసింది. నందన్ నిలేకని ప్యానెల్ పట్టణ ప్రాంతాల్లోని స్థానిక రిటైల్ స్టోర్స్, ఇతర షాపులను క్యాష్ పాయింట్లుగా ఉపయోగించుకోవాలని ఆర్‌బీఐకి తెలియజేసింది. ఒకవేళ ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే.. ఏటీఎంల స్థానాన్ని కిరాణా […]

క్యాష్ ఇన్ క్యాష్ ఔట్: ఇక కిరాణా షాపులే ఏటీఎం సెంటర్లు!
Follow us on

ఏటీఎంల సంఖ్య తగ్గుతూ వస్తోంది. కానీ ఏటీఎం వినియోగదారులు మాత్రం పెరిగిపోతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన నందన్ నిలేకని సారథ్యంలోని ఉన్నత స్థాయి కమిటీ సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. దీన్ని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (ఆర్‌బీఐ) కూడా తెలియజేసింది. నందన్ నిలేకని ప్యానెల్ పట్టణ ప్రాంతాల్లోని స్థానిక రిటైల్ స్టోర్స్, ఇతర షాపులను క్యాష్ పాయింట్లుగా ఉపయోగించుకోవాలని ఆర్‌బీఐకి తెలియజేసింది. ఒకవేళ ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే.. ఏటీఎంల స్థానాన్ని కిరాణా షాపులు భర్తీ చేస్తాయని బ్యాంకింగ్ పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కొత్త విధానానికి క్యాష్ ఇన్ క్యాష్ ఔట్ (సీఐసీవో) అనే పేరు పెట్టారు. ఇక్కడ కస్టమర్లు రిటైల్ స్టోర్లకు వెళ్లి వారి డిజిటల్ మనీని నగదుగా మార్చుకోవచ్చు. ఇందుకోసం క్యూఆర్ కోడ్, ఆధార్ ఆధారిత పేమెంట్ వ్యవస్థను ఉపయోగించుకోవచ్చు.