AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి టెండర్లు..

రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం టెండర్లకు ఆహ్వనం పలికింది. టెండర్లు స్వీకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారి చేసింది...

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి టెండర్లు..
Sanjay Kasula
|

Updated on: Jul 28, 2020 | 5:52 AM

Share

రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం టెండర్లకు ఆహ్వనం పలికింది. టెండర్లు స్వీకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారి చేసింది. జ్యుడిషియల్‌ ప్రివ్యూ అనంతరం టెండర్లకు నోటిఫికేషన్‌ను జలవనరుల శాఖ అధికారులు విడుదల చేశారు.

టెండర్ నోటిఫికేషన్ వివరాలు..

ఈపీసీ(EPC)విధానంలో 3278.18 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 30 నెలల్లో పనులు పూర్తి చేసేలా టెండర్లను జలవనరుల శాఖ ఆహ్వానించింది. వచ్చే నెల 13వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్‌ దరఖాస్తులు స్వీకరించనున్నారు. 13న టెక్నికల్ బిడ్ తెరిచి, 17న రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహించి ఆ తర్వాత 19న టెండర్‌ను ఖరారు చేయనున్నారు.

శ్రీశైలం రిజర్వాయర్‌లో 800 అడుగుల నీటి మట్టం వద్ద రోజుకి 34,722 క్యూసెక్కుల వరద నీటిని ఎత్తిపోయడమే లక్ష్యంగా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది.

ట్రైబ్యునల్ ఆదేశాలు..

ఇదిలావుంటే.. తాము నియమించిన కమిటీ నివేదిక వచ్చే వరకూ రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టొద్దని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (NTGT) చెన్నై జోనల్‌ బెంచ్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర పర్యావరణ శాఖ, జల్‌శక్తి, కేంద్ర జలసంఘం, కృష్ణానది యాజమాన్య బోర్డుల అనుమతులు లేకుండానే ఈ ఎత్తిపోతల నిర్మిస్తున్నారంటూ తెలంగాణలోని నారాయణపేట జిల్లా బాపన్‌పల్లికి చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌ ఎన్జీటీని ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కొద్ది మొత్తంలో నీళ్లు తీసుకుంటున్నామంటూ తెలంగాణ ప్రజల ప్రయోజనాలు దెబ్బతీసేలా జల దోపిడీ చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల లాభ..నష్టాలపై ఈ కమిటీ పరిశీలించి రెండు నెలల్లో నివేదిక సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేసింది.