రాజ్యసభ ఎంపీ, మాజీ మంత్రి, సమాజ్వాదీ పార్టీ మాజీ నాయకుడు అమర్ సింగ్(64) కన్నుమూశారు. చాలా రోజులుగా అనారోగ్యంతో ఉన్న అమర్ సింగ్ సింగపూర్లోని ఓ ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందారు. 2013లో ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడి కోలుకున్న ఆయన.. 2016లో తిరిగి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అమర్ సింగ్కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా 2020 మార్చిలో సైతం అమర్ సింగ్ మరణం గురించి పుకార్లు వెలువడినప్పుడు టైగర్ జిందా హై అని పేర్కొన్నారు. కాగా నటి జయప్రదకు అమర్ సింగ్ చాలా సన్నిహితులు. జయప్రదను జాతీయ రాజకీయాల్లోకి తీసుకొచ్చింది అమర్ సింగ్నే. రాజకీయాల్లో ఆయన్ని గురువుగా భావిస్థారు సీనియర్ నటి జయ ప్రద.
Read More:
బిగ్ బ్రేకింగ్ః కరోనాతో మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి
విశాఖ ‘షిప్ యార్డు ప్రమాద ఘటన’పై సీఎం జగన్ ఆరా..
‘ఆత్మ నిర్భర్ భారత్ లోగో’ తయారు చేయండి.. రూ.25 వేలు గెలుపొందండి!
ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు టీ షర్ట్స్, జీన్స్ ధరించడం నిషేధం