అలెర్ట్ : నేడు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
వానలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తూ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
వానలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తూ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. ఒడిశా తీరాన ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శుక్రవారం తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ప్రధానంగా నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్, వరంగల్ గ్రామీణ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి.
ములుగుతో పాటు మొగుళ్లపల్లిలో అత్యధికంగా 17 సెం.మీ వర్షపాతం నమోదయ్యింది. వరంగల్ గ్రామీణ జిల్లా నల్లబెల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపూర్లలో 14 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, శాయంపేట, ములుగు జిల్లా వెంకటాపురంలలో 13 సెం.మీ, వరంగల్ గ్రామీణ జిల్లా పర్కాల, భద్రాద్రి జిల్లా మణుగూరు, భూపాలపల్లిలో 12 సెం.మీ వర్షపాతం నమోదైంది.
Also Read :