మ‌హిళ‌లే అత‌డి టార్గెట్..ఎంజాయ్ చెయ్య‌డం..చంప‌డం..

|

Jun 07, 2020 | 1:06 PM

అత‌డిది సైకో మైండ్సెట్. త‌న భార్య‌కు మ‌తి స్థిమితం లేక‌పోవ‌డంతో క‌నిపించి‌న ఆడ‌వాళ్లందర్నీ త‌ప్పుడు కోణంతో చూసేవాడు. అలా రాష్ట్రాలు, జిల్లాలు దాటుతూ మ‌హిళ‌ల‌తో సంబంధాలు పెట్టుకుంటూ, త‌న‌కు లొంగ‌క‌పోతే ప్రాణాలు తీస్తూ నేరాలు చేశాడు. చివర‌కు పాపం పండి పోలీసులకు చిక్కాడు.

మ‌హిళ‌లే అత‌డి టార్గెట్..ఎంజాయ్ చెయ్య‌డం..చంప‌డం..
Follow us on

అత‌డిది సైకో మైండ్సెట్. త‌న భార్య‌కు మ‌తి స్థిమితం లేక‌పోవ‌డంతో క‌నిపించి‌న ఆడ‌వాళ్లందర్నీ త‌ప్పుడు కోణంతో చూసేవాడు. అలా రాష్ట్రాలు, జిల్లాలు దాటుతూ మ‌హిళ‌ల‌తో సంబంధాలు పెట్టుకుంటూ, త‌న‌కు లొంగ‌క‌పోతే ప్రాణాలు తీస్తూ నేరాలు చేశాడు. చివర‌కు పాపం పండి పోలీసులకు చిక్కాడు.

సవర రమేష్ అనే వ్య‌క్తి ఒడిశా రాష్ట్రం జగపతి జిల్లా వలకభద్ర పంచాయతీ నివాసి. భార్యకు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో అతని క‌నిపించిన ఆడవాళ్లంద‌ర్నీ అనుభ‌వించాల‌నుకునేవాడు. 2016లో దాసేటి దమయంతి అనే మహిళతో లైంగిక వాంఛ తీర్చుకుందామ‌నుకున్నాడు. ఆమె నిరాకరించడంతో ప్రాణాలు తీశాడు. అక్క‌డ నుంచి పారిపోయి తెలంగాణ వ‌చ్చి..‌ 2017లో ముచ్చిక కోసమ్మ అనే ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వారిద్దరి మధ్య ఏ గొడ‌వ‌ వచ్చిందో గానీ ఆమెను కూడా అంతమొందించాడు. తర్వాత ఏపీలోని శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం పుట్టపురం గ్రామం వచ్చి గుట్టుగా త‌న ఫోక‌స్ సాగించాడు. అక్కడ దండు జయంతి అనే మహిళతో సంబంధం పెట్టుకుఉన్నాడు. చివరకు 2019 డిసెంబర్‌లో ఆమె ప్రాణాలు కూడా తీశాడు. ఆమెతో సన్నిహితంగా మెలిగినప్పుడు కొంత న‌గ‌దు ఇచ్చింద‌ని, అవి తిరిగి ఇవ్వాల‌ని కోడంతో జ‌యంతిని హ‌త‌మార్చి..ద‌గ్గ‌ర్లో ఉన్న కాల్వ‌లో ప‌డేసి పారిపోయాడ‌ని ఎస్పీ తెలిపాడు. ఆ సమయంలో మృతురాలి సెల్‌ఫోన్‌ తీసుకువెళ్లి… నాలుగు నెలల తర్వాత స్విచాన్‌ చేయడంతో సిగ్నల్స్‌ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు.