
ప్రముఖ సినీ నిర్మాత జ్ఞానవేల్ రాజాకి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రామనాథరాపురం జిల్లాలో ఫైనాన్స్ వ్యాపారంలో 300 కోట్ల వరకు ఖాతాదారులకు ఆయన కుచ్చు టోపీ పెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. మనీ & గ్యాంగ్ ఫైనాన్స్ పేరుతో కోట్లలో చీటింగ్ చేయడంతో, బాధితులు రామనాథపురం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. మనీ & గ్యాంగ్ ఫైనాన్స్ జ్ఞానవేల్ రాజా సినిమాలకు పెద్ద ఎత్తున్న ఫైనాన్స్ చేసినట్టు గుర్తించిన పోలీసులు.. చీటింగ్ కు సంబంధించి వివరణ కోరారు.
అయితే సినిమా లావాదేవీలు తప్ప ఈ ఫైనాన్స్ సంస్థతో తనకు ఎటువంటి సంబంధం లేదంటూ ఆయన చెబుతూ వస్తున్నారు. అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులకు తన వెర్షన్ చెబుతానని మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించాడు జ్ఞానవేల్ రాజా. అందుకు ఒప్పుకోని మద్రాస్ హైకోర్టు.. ఆగష్టు 7 న రామనాథపురం పోలీస్ స్టేషన్ కి నేరుగావెళ్లి వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.