ప్రముఖ సినీ నిర్మాత జ్ఞానవేల్ రాజాకి మద్రాస్ హైకోర్టు నోటీసులు..

ప్రముఖ సినీ నిర్మాత జ్ఞానవేల్ రాజాకి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రామనాథరాపురం జిల్లాలో ఫైనాన్స్ వ్యాపారంలో 300 కోట్ల వరకు ఖాతాదారులకు ఆయ‌న‌ కుచ్చు టోపీ పెట్టిన‌ట్లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి.

ప్రముఖ సినీ నిర్మాత జ్ఞానవేల్ రాజాకి మద్రాస్ హైకోర్టు నోటీసులు..

Updated on: Jul 23, 2020 | 8:59 PM

ప్రముఖ సినీ నిర్మాత జ్ఞానవేల్ రాజాకి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రామనాథరాపురం జిల్లాలో ఫైనాన్స్ వ్యాపారంలో 300 కోట్ల వరకు ఖాతాదారులకు ఆయ‌న‌ కుచ్చు టోపీ పెట్టిన‌ట్లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. మనీ & గ్యాంగ్ ఫైనాన్స్ పేరుతో కోట్లలో చీటింగ్ చేయడంతో, బాధితులు రామ‌నాథ‌పురం పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ ప్రారంభించారు. మనీ & గ్యాంగ్ ఫైనాన్స్ జ్ఞానవేల్ రాజా సినిమాల‌కు పెద్ద ఎత్తున్న ఫైనాన్స్ చేసిన‌ట్టు గుర్తించిన పోలీసులు.. చీటింగ్ కు సంబంధించి వివ‌ర‌ణ కోరారు.

అయితే సినిమా లావాదేవీలు తప్ప ఈ ఫైనాన్స్ సంస్థతో తనకు ఎటువంటి సంబంధం లేదంటూ ఆయ‌న చెబుతూ వ‌స్తున్నారు. అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులకు త‌న వెర్ష‌న్ చెబుతాన‌ని మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించాడు జ్ఞానవేల్ రాజా. అందుకు ఒప్పుకోని మద్రాస్ హైకోర్టు.. ఆగష్టు 7 న రామనాథపురం పోలీస్ స్టేషన్ కి నేరుగావెళ్లి వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.