చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో కానిస్టేబుల్ గన్ మిస్ ఫైర్ అయింది. ఈ ఘటనలో సుబ్రహ్మణ్యం అనే కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. గార్డ్ డ్యూటీలో ఉన్న సుబ్రమణ్యం వెపన్ డిపాజిట్ చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆలయం రూఫ్ కి బుల్లెట్ తగిలి రాయి కానిస్టేబుల్ చెవికి తాకడంతో చిన్నపాటి గాయం అయింది. ఏఆర్ డీఎస్పీ తో పాటు శ్రీకాళహస్తి డిఎస్పీ ఘటనపై విచారణ జరుపుతున్నారు. రాత్రి 7.30 గంటల సమయంలో కంచు గడప దగ్గర ఆలయం తలుపులు మూసి గార్డ్ రూమ్ లో వెపన్స్ డిపాజిట్ చేసే సమయంలో ఈ మిస్ ఫైరింగ్ సంభవించిందని శ్రీకాళహస్తి ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి టీవీ9కు తెలిపారు.