నేడు వారణాసికి ప్రధాని, హందియా-రాజతలాబ్ నూతన మార్గాన్ని ప్రారంభించనున్న మోదీ !

|

Nov 30, 2020 | 7:21 AM

ప్రధాని నరేంద్రమోదీ నేడు ఉత్తర్​‌ప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటించనున్నారు. నేషనల్ హైవే-19లో భాగమైన హందియా-రాజతలాబ్ నూతన మార్గాన్ని ప్రారంభించనున్నారు.

నేడు వారణాసికి ప్రధాని, హందియా-రాజతలాబ్ నూతన మార్గాన్ని ప్రారంభించనున్న మోదీ !
Follow us on

ప్రధాని నరేంద్రమోదీ నేడు ఉత్తర్​‌ప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటించనున్నారు. నేషనల్ హైవే-19లో భాగమైన హందియా-రాజతలాబ్ నూతన మార్గాన్ని ప్రారంభించనున్నారు. 73 కిలోమీటర్ల పొడవైన ఈ కొత్త మార్గం కోసం గవర్నమెంట్ రూ.2,447 కోట్లు ఖర్చు చేసింది. ఈ మార్గం ద్వారా ప్రయాణిస్తే అలహాబాద్ నుంచి వారణాసి చేరుకునేందుకు గతంలో కంటే గంట సమయం తక్కువ పడుతుంది.

ఇక  ఈ పర్యటనలో ప్రధాని.. కాశీ విశ్వనాథ్ ఆలయ కారిడార్ ప్రాజెక్ట్ నిర్వహణ పనులను రివ్యూ చేయనున్నారు. సారనాథ్ పురావస్తు ప్రదేశంలో నిర్వహిస్తోన్న ఓ లైట్​ షోకు హాజరుకానున్నారు. తర్వాత, వారణాసిలోని దేవ్​ దీపావళి కార్యక్రమానికి వెళ్లనున్నారు. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా వారణాసిలో రాజ్​ ఘాట్​ వద్ద ప్రధాని దీపం వెలిగించనున్నారు. కార్తీక పౌర్ణిమ పురస్కరించుకుని గంగా తీరంలో దాదాపు 11 లక్షల దీపాలు వెలిగిస్తారు భక్తులు.

Also Read :

AP Assembly : నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..అస్త్రశస్త్రాలతో అధికార, ప్రతిపక్షాలు రెడీ !

Ind vs Aus : రెండో వన్డే​లో క్రేజీ సీన్, ఆసిస్ లేడీ ఫ్యాన్‌కు ప్రపోజ్ చేసిన ఇండియా కుర్రోడు