వరుసగా 20వ రోజు.. పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి..

|

Jun 26, 2020 | 10:56 AM

వరుసగా 20వ రోజు చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. వివిధ మెట్రో నగరాల్లో పెట్రోల్ ధర లీటర్‌కు 21 పైసలు పెరగగా,  డీజిల్ ధర 17 పైసలు పెరిగింది. పెరిగిన ధరల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.80.13 చేరగా.. డీజిల్ రూ. 80.19కి చేరుకుంది. అలాగే ఆర్ధిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 86.91కి పెరగగా.. డీజిల్ ధర రూ. 78.51కి పెరిగింది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ […]

వరుసగా 20వ రోజు.. పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి..
Follow us on

వరుసగా 20వ రోజు చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. వివిధ మెట్రో నగరాల్లో పెట్రోల్ ధర లీటర్‌కు 21 పైసలు పెరగగా,  డీజిల్ ధర 17 పైసలు పెరిగింది. పెరిగిన ధరల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.80.13 చేరగా.. డీజిల్ రూ. 80.19కి చేరుకుంది. అలాగే ఆర్ధిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 86.91కి పెరగగా.. డీజిల్ ధర రూ. 78.51కి పెరిగింది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 81.82 ఉండగా.. డీజిల్ రూ.75.35 ఉంది.

ఇక చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 83.39 పెరగ్గా.. డీజిల్ రూ. 77.46కి పెరిగింది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ. 83.16కి చేరగా.. డీజిల్ రూ. 78.34కి చేరింది. కాగా, గత 20 రోజుల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 8.93 పెరగగా, డీజిల్ లీటరుకు రూ. 10.07 పెరిగింది. దేశ వ్యాప్తంగా స్థానిక పన్నుల్లో వ్యత్యాసాలు వల్లే ఆయా చోట్లలో ధరలు మార్పు ఉంటోందని చమురు కంపెనీలు చెబుతున్నాయి.