ఇది ప్రజా విజయం : వైసీపీ నేత పృధ్వీ

వైసీపీ ఆధిక్యంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఈ పార్టీ అభ్యర్ధులు, ఏజెంట్ల సందడి నెలకొంది. అనేక చోట్ల పటాసులు కాల్చుతూ, స్వీట్లు పంచుకుంటున్నారు. ఇది ప్రజా విజయమని వైసీపీ నేత, నటుడు పృధ్వీ అభివర్ణించారు. పార్టీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర మొదలు పెట్టి నప్పటి నుంచే ఆయన నాయకత్వంపై ప్రజలు విశ్వాసం పెంచుకున్నారని, పేదలు, మహిళల అభ్యున్నతికి జగన్ కృషిచేస్తారన్న నమ్మకం వారికి పూర్తిగా కలిగిందని చెప్పిన ఆయన.. […]

ఇది ప్రజా విజయం : వైసీపీ నేత పృధ్వీ

Updated on: May 23, 2019 | 11:33 AM

వైసీపీ ఆధిక్యంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఈ పార్టీ అభ్యర్ధులు, ఏజెంట్ల సందడి నెలకొంది. అనేక చోట్ల పటాసులు కాల్చుతూ, స్వీట్లు పంచుకుంటున్నారు. ఇది ప్రజా విజయమని వైసీపీ నేత, నటుడు పృధ్వీ అభివర్ణించారు. పార్టీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర మొదలు పెట్టి నప్పటి నుంచే ఆయన నాయకత్వంపై ప్రజలు విశ్వాసం పెంచుకున్నారని, పేదలు, మహిళల అభ్యున్నతికి జగన్ కృషిచేస్తారన్న నమ్మకం వారికి పూర్తిగా కలిగిందని చెప్పిన ఆయన.. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో వైసీపీ ఆధిక్యంలో కొనసాగడమే ఇందుకు నిదర్శనమన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us