Delhi elections 2020: ఒక్కరోజులోనే ఆ పార్టీకి 10 లక్షల మంది మద్దతు!

Delhi elections 2020: ఆమ్‌ఆద్మీపార్టీ మూడోసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 24 గంటల్లోనే ప్రజల నుంచి భారీ మద్దతు లభించిందని పార్టీ పేర్కొంది. ఆప్ విజయ దుందుభిని చూసి దేశ వ్యాప్తంగా పది లక్షల మంది ఆప్ సభ్యత్వ నమోదును తీసుకున్నారని పార్టీ ప్రతినిధులు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తాజా ఫలితాల్లో 70స్థానాలకు 62సీట్లలో గెలిచి విజయ ఢంకా మోగించింది. దేశ అభివృద్ధి కోసం ‘ఆమ్‌ఆద్మీ రాష్ట్ర నిర్మాణ్’ పేరుతో ఉన్న దానిలో చేరాలంటూ […]

Delhi elections 2020: ఒక్కరోజులోనే ఆ పార్టీకి 10 లక్షల మంది మద్దతు!

Updated on: Feb 13, 2020 | 4:46 PM

Delhi elections 2020: ఆమ్‌ఆద్మీపార్టీ మూడోసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 24 గంటల్లోనే ప్రజల నుంచి భారీ మద్దతు లభించిందని పార్టీ పేర్కొంది. ఆప్ విజయ దుందుభిని చూసి దేశ వ్యాప్తంగా పది లక్షల మంది ఆప్ సభ్యత్వ నమోదును తీసుకున్నారని పార్టీ ప్రతినిధులు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తాజా ఫలితాల్లో 70స్థానాలకు 62సీట్లలో గెలిచి విజయ ఢంకా మోగించింది.

దేశ అభివృద్ధి కోసం ‘ఆమ్‌ఆద్మీ రాష్ట్ర నిర్మాణ్’ పేరుతో ఉన్న దానిలో చేరాలంటూ ఆప్ పిలుపునిచ్చింది. దీనికి స్పందించిన దేశ ప్రజలు పది లక్షలకు పైగా పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. తమ పార్టీకి మద్దతు తెలిపే వారు పేర్కొన్న ఫోన్‌ నంబరుకు కాల్‌ చేయాలని కోరింది. దీంతో 24గంటల్లోనే ప్రజలు భారీగా స్పందించారు.

[svt-event date=”13/02/2020,4:30PM” class=”svt-cd-green” ]

Loading...
Unable to load recommendations.
Follow Us