“నేత్రదానం శ్రేష్ఠమైన దానం”

|

Sep 09, 2020 | 8:18 PM

నేత్రదాన మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ స్వతహాగా పాల్గొనాలని వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. 

నేత్రదానం శ్రేష్ఠమైన దానం
Follow us on

నేత్రదాన మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ స్వతహాగా పాల్గొనాలని వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.  సక్షమ్‌ స్వచ్ఛంద సంస్థ దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సంస్థ తాజాగా నిర్వహించిన నేత్రదాన పక్షోత్సవాల ముగింపు కార్యక్రమంలో వెంకయ్య వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. నేత్రదానాన్ని గొప్ప దానంగా అభివర్ణించిన ఆయన.. సొసైటీకి మనమిచ్చే అత్యున్నత కానుకల్లో నేత్రదానం ఒకటన్నారు. నేత్రదానం చేసేవారి సంఖ్య దేశంలో చాలా తక్కువగా ఉందని, మున్ముందు మరింత పెరుగుతుందని ఆకాక్షించారు.

ప్రజల్లో నేత్రదానం పట్ల చైతన్యం తీసుకురావడం, జిల్లాస్థాయి వైద్య వ్యవస్థలో మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా అవయవ దానం దిశగా ప్రొత్సాహం పెరగాలని సూచించారు. దేశంలో 46లక్షల మంది అంధత్వంతో బాధ పడుతున్నారని, అందులో ఎక్కువగా 50ఏళ్లకు పైబడిన వారున్నారని వెంకయ్యనాయుడు తెలిపారు. . ఏటా 20వేల మంది కొత్తగా కంటి సంబంధిత సమస్యలకు గురవుతున్నారని, వీరిలో యువత, చిన్నారులు ఉండటం బాధ కలిగిస్తుందని పేర్కొన్నారు.