సీలింగ్ ఫ్యాన్ , బెడ్ లేక జైల్లో రియా చక్రవర్తి ‘కష్టాలు’ !
సుశాంత్ కేసులో అరెస్టయి, బెయిలుకు నోచుకోని రియా చక్రవర్తి బైకుల్లా జైల్లో నానా కస్టాలు పడుతోంది. తన సెల్ లో ఆమెకు సీలింగ్ ఫ్యాన్ గానీ, బెడ్ గానీ లేవు. సింగిల్ సెల్ లో బిక్కుబిక్కుమంటూ సదా పోలీసుల నిఘా కింద గడుపుతోంది..
సుశాంత్ కేసులో అరెస్టయి, బెయిలుకు నోచుకోని రియా చక్రవర్తి బైకుల్లా జైల్లో నానా కస్టాలు పడుతోంది. తన సెల్ లో ఆమెకు సీలింగ్ ఫ్యాన్ గానీ, బెడ్ గానీ లేవు. సింగిల్ సెల్ లో బిక్కుబిక్కుమంటూ సదా పోలీసుల నిఘా కింద గడుపుతోంది. తన కూతురు షీనా బోరాను హతమార్చిన కేసులో దోషి ఇంద్రాణి ముఖర్జియాను ఉంచిన సెల్ పక్కనే ఈమె సెల్ కూడా ఉంది. మూడు షిఫ్తుల్లో ఇద్దరేసి చొప్పున పోలీసులను ఆమెకు కాపలాగా పెట్టారు. రియాకు నేల మీద పడుకునేందుకు అధికారులు ఓ దుప్పటిని మాత్రమే ఇచ్చారు. కోర్టు అనుమతిస్తే ఆమెకు టేబుల్ ఫ్యాన్ సౌకర్యం కల్పిస్తారట. ఈ కరోనా సీజన్ లో ఖైదీలు రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు వారికి పాలు, కషాయం ఇస్తున్నారు. ఎందుకంటే కొంతమంది మహిళా రోగులు కోవిడ్ తో బాధపడుతున్నారట !