కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి.. కవిత, పోతాంకర్, సుభాష్ భవితవ్యం తేలేది రేపే

|

Oct 11, 2020 | 12:43 PM

నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. రేపు(సోమవారం) ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం ఓటర్లు 824మంది ఉండగా, పోలైన ఓట్లు 823. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 02. ఇక ఓట్ల లెక్కింపు 2 రౌండ్లలో 6 టేబుళ్ళమీద జరుగుతుంది. మొదటి రౌండ్ లో 6 వందల ఓట్లు, రెండో రౌండ్ లో 223 ఓట్లు లెక్కిస్తారు. ఒక్కో పార్టీకి 8 మంది ఏజెంట్లకు మాత్రమే అనుమతిచ్చారు. […]

కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి..  కవిత, పోతాంకర్, సుభాష్ భవితవ్యం తేలేది రేపే
Follow us on

నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. రేపు(సోమవారం) ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం ఓటర్లు 824మంది ఉండగా, పోలైన ఓట్లు 823. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 02. ఇక ఓట్ల లెక్కింపు 2 రౌండ్లలో 6 టేబుళ్ళమీద జరుగుతుంది. మొదటి రౌండ్ లో 6 వందల ఓట్లు, రెండో రౌండ్ లో 223 ఓట్లు లెక్కిస్తారు. ఒక్కో పార్టీకి 8 మంది ఏజెంట్లకు మాత్రమే అనుమతిచ్చారు. లెక్కింపు నుంచి మూడు గంటల్లో అంటే, ఉదయం 11 గంటల వరకు ఫలితం వెలువడనున్నదని భావిస్తున్నారు. కోవిడ్ నిబంధనలు అనుగుణంగా ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఎమ్మెల్సీ బరిలో టీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత వుండగా, పోతాంకర్ లక్ష్మీనారాయణ (బీజేపీ), సుభాష్ రెడ్డి( కాంగ్రెస్) భవితవ్యం రేపు తేలిపోనుంది.