నెల్లూరులో రెచ్చిపోయిన అల్లరిమూక.. నడిరోడ్డుపై యువకుడిని చావబాదిన రౌడీలు.. సోషల్ మీడియా వైరల్ తో కదిలిన పోలీసులు

|

Nov 17, 2020 | 5:59 PM

నెల్లూరు ఓ అల్లరిమూక రెచ్చిపోయింది. ఓ వ్యక్తిని పబ్లిక్ గా విచక్షణారహితంగా చితకబాదారు. కర్రతో అంత్యంత దారుణంగా.. పశువును బాదినట్లు బాదాడు ఓ వ్యక్తి.

నెల్లూరులో రెచ్చిపోయిన అల్లరిమూక.. నడిరోడ్డుపై యువకుడిని చావబాదిన రౌడీలు.. సోషల్ మీడియా వైరల్ తో కదిలిన పోలీసులు
Follow us on

నెల్లూరు ఓ అల్లరిమూక రెచ్చిపోయింది. ఓ వ్యక్తిని పబ్లిక్ గా విచక్షణారహితంగా చితకబాదారు. కర్రతో అంత్యంత దారుణంగా.. పశువును బాదినట్లు బాదాడు ఓ వ్యక్తి.. నెల్లూరులో జరిగిన ఈ దాడి.. సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. నెల్లూరులోనే ఈ రౌడీ మూకలు వీరంగం సృష్టిస్తున్నారు. బెదిరింపులకు దిగడం యువకులపై దాడులు చేయడం లాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువయ్యాయి. నెల్లూరులో ఎక్కడ చూసినా ఈ రౌడీ గ్యాంగ్‌ల హడావుడే కన్పిస్తోంది. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

నెల్లూరు ప్రాంతానికి చెందిన యుగంధర్ అనే యువకుడిని అదే ప్రాంతానికి చెందిన రాజశేఖర్‌ చావబాదాడు. ఓ కారు యాక్సిడెంట్ వ్యవహారం.. ఇలా గొడవకు కారణం. కిశోర్ అనే యువకుడి కారును తీసుకెళ్లిన యుగంధర్‌… ఓ యాక్సిడెంట్ చేశాడు. డ్యామేజ్ ఖర్చులు చెల్లించాలంటూ అడిగిన కిశోర్‌కు.. రేపు మాపు అంటూ తిప్పించుకుంటున్నాడు. దీంతో.. రాజశేఖర్‌ను ఆశ్రయించాడు కిశోర్‌. యుగంధర్‌ను పట్టుకున్న రాజశేఖర్‌.. పిచ్చపిచ్చగా చితకబాదాడు. ఈ సంఘటన గురించి ఆరా తీసిన టీవీ9 టీమ్‌కు మరికొన్ని విషయాలు తెలిశాయి. ఈ దాడి ఇప్పుడు జరిగింది కాదు.. మూడు నెలల క్రితం జరిగినట్లు తేలింది. అప్పుడు తీసిన వీడియోను.. ఇప్పుడు లేటెస్టుగా వైరల్‌ చేశారు.

నెల్లూరు నగరంలో రౌడీ మూకలు నానా బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రధానంగా యువకులపైనే దాడులుకు దిగుతున్నాయి. ఓవైపు ఈ దాడి వీడియోలన్నీ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నా… అటు బాధితులు మాత్రం పోలీసులను ఆశ్రయించడం లేదు. ఈ దాడులకు సంబంధించి ఒక్క ఫిర్యాదు కూడా పోలీసులకు అందలేదు. ఇవి బెట్టింగ్‌ మాఫియా ఆగడాలుగా స్థానికులు చెబుతున్నాయి. రీసెంట్‌గా జరిగిన ఐపీఎల్‌లో బెట్టింగ్‌లు వేసి ఆ డబ్బులు ఇవ్వని యువకులపై రౌడీ గ్యాంగ్‌లు ఇలా దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. వీడియో వైరల్ కావడంతో.. రాజశేఖర్‌ కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు.