దేశ హితం కోసం గొంతెత్తుతాం..కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఇటలీ నుంచి ట్వీట్ చేసిన రాహుల్

|

Dec 28, 2020 | 11:12 AM

కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ హితం కోసం గొంతెత్తడానికి తమ పార్టీ ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటుందని హామీ ఇచ్చారు. సత్యం, సమానత్వం కోసం పనిచేస్తామని చెప్పుకొచ్చారు...

దేశ హితం కోసం గొంతెత్తుతాం..కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఇటలీ నుంచి ట్వీట్ చేసిన రాహుల్
Follow us on

కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ హితం కోసం గొంతెత్తడానికి తమ పార్టీ ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటుందని హామీ ఇచ్చారు. సత్యం, సమానత్వం కోసం పనిచేస్తామని చెప్పుకొచ్చారు.

‘‘దేశ హితం కోసం గొంతెత్తడానికి కాంగ్రెస్ తరపున మేం కంకణబద్ధులమై ఉన్నాం. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సత్యం, సమానత్వం కోసం ఈ ప్రతిజ్ఞను పునరుద్ఘాటిస్తున్నాం. జై హింద్’’ అని రాహుల్ గాంధీ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆదివారం ఇటలీకి వెళ్లారు. వ్యక్తిగత పనిమీదే వెళ్లారని పార్టీ పేర్కొంది. అయితే అక్కడ ఉంటున్న అమ్మమ్మను కలవడానికి వెళ్లినట్లు సమాచారం. దీంతో ఆయన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనలేకపోయారు. అందుకే ట్విట్టర్ వేదికగా రాహుల్ స్పందించారు.