‘ఈచ్​ వన్​.. ప్లాంట్​ వన్​’ కు పిలుపునిచ్చిన మంత్రి కేటీఆర్​

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం ఆరో విడత కార్యక్రమాన్ని మంత్రి కేటీ రామారావు ఔటర్​ రింగ్​ రోడ్డు లోని దుండిగల్​ ఎగ్జిట్​ 5 వద్ద ప్రారంభించారు. మెట్రోపాలిటన్​ డెవలప్​మెంట్​ అథారిటీ(హెచ్ఎండిఏ) నర్సరీ సమీపంలో మొక్కలు నాటారు

‘ఈచ్​ వన్​.. ప్లాంట్​ వన్​’ కు పిలుపునిచ్చిన మంత్రి కేటీఆర్​

Updated on: Jun 25, 2020 | 5:06 PM

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం ఆరో విడత కార్యక్రమాన్ని మంత్రి కేటీ రామారావు ఔటర్​ రింగ్​ రోడ్డు లోని దుండిగల్​ ఎగ్జిట్​ 5 వద్ద ప్రారంభించారు. మెట్రోపాలిటన్​ డెవలప్​మెంట్​ అథారిటీ(హెచ్ఎండిఏ) నర్సరీ సమీపంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హెచ్​ఎండిఏ హరితహారం బ్రోచర్​ను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్.. ‘ఈచ్ వన్ ప్లాంట్ వన్’ అనే నినాదంతో ముందుకెళుతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి, వాటిని సంరక్షించాలన్నారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్వహించే ఔటర్ రింగ్ వెంట ప్రతి పది కిలోమీటర్లకు ఒక ‘థీమ్​’ ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా పురపాలక శాఖ అధ్వర్యంలో మొత్తం 12.5 కోట్ల మొక్కలు నాటడమే తమ లక్ష్యమని అన్నారు. అంతరిస్తున్న ఆడవులను సంరక్షించుకోవాలంటే ఉద్యమస్ఫూర్తితో ముందుకెళ్లాలన్నారు.

Follow Us