ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి బొత్స..అందుకే ఇళ్ల పట్టాల పంపిణీ ఆలస్యమైందని వెల్లడి

ఏపీలో పేద ప్రజలకు రేపు పండుగ రోజన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి దాదాపు 35 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామని తెలిపారు...

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి బొత్స..అందుకే ఇళ్ల పట్టాల పంపిణీ ఆలస్యమైందని వెల్లడి

Updated on: Dec 24, 2020 | 8:14 PM

Distribute Houses : ఏపీలో పేద ప్రజలకు రేపు పండుగ రోజన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి దాదాపు 35 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామని తెలిపారు. 15 లక్షల ఇళ్ల పనులను ప్రారంభిస్తున్నామని చెప్పారు. రెండు వారాలపాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని శుక్రవారం సీఎం జగన్‌ తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో ప్రారంభిస్తారని వెల్లడించారు.

విశాఖలోనే 1350 కోట్ల విలువైన 4457 ఎకరాలు పంపిణీ చేస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 23 వేల కోట్ల విలువైన 68 వేల 300 ఎకరాలు పేదలకు ఇస్తున్నట్లు వివరించారు. 4 లక్షల మంది సొంత స్థలం వున్న వారికి లక్షా 80 వేల ఆర్ధిక సాయం అందిస్తామన్నారు. పేదరికమే ప్రాతిపదికగా ఇళ్ల పట్టాలను కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు బొత్స. రాష్ట్ర రాజకీయాల్లో ఇదో మహత్తర ఘట్టమన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు మనుషులు కోర్టులకు వెళ్లడం వల్ల ఇళ్ల పట్టాల పంపిణీ ఆలస్యమైందని బొత్స విమర్శించారు. భూ సర్వే చేస్తే భూ దోపిడీ అని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పేదవాళ్లు పేదవాళ్లుగానే ఉండిపోవాలా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us