కర్నూల్ నుంచి విశాఖ వచ్చిన మొదటి ఫ్లైట్ పాసింజర్స్ కి అవంతి గ్రాండ్‌ వెల్ కం, రాష్ట్రంలో 6 ఎయిర్‌పోర్టులు గర్వకారణమని వ్యాఖ్య

|

Mar 28, 2021 | 4:56 PM

Minister Avanthi Grand Welcome to First Flight Passengers : కర్నూల్ నుంచి విశాఖ వచ్చిన మొదటి ఫ్లైట్ ప్యాసింజర్స్ కి టూరిజం శాఖ మంత్రి అవంతి..

కర్నూల్ నుంచి విశాఖ వచ్చిన మొదటి ఫ్లైట్ పాసింజర్స్ కి అవంతి గ్రాండ్‌ వెల్ కం, రాష్ట్రంలో 6 ఎయిర్‌పోర్టులు గర్వకారణమని వ్యాఖ్య
Avanthi Vsp Airport Kurnool
Follow us on

Minister Avanthi Grand Welcome to First Flight Passengers : కర్నూల్ నుంచి విశాఖ వచ్చిన మొదటి ఫ్లైట్ ప్యాసింజర్స్ కి టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఘన స్వాగతం పలికారు. ఏపీలో మూడు రాజధానుల నేపథ్యంలో ఉత్తరాంధ్ర- రాయలసీమని కలుపుతూ విమానాలు నడిపించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘనత అని అవంతి చెప్పుకొచ్చారు. కర్నూలులో ఎయిర్‌ పోర్టు ఏర్పాటు వల్ల టూరిజంతో పాటు వ్యాపార, వాణిజ్య సంబంధాలు బలపడతాయన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 6 ఎయిర్ పోర్టులు ఉండడం గర్వకారణమని టూరిజం మంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కి ఉజ్వల భవిష్యత్ ఉందన్న అవంతి.. రాష్ట్ర ప్రభుత్వ కృషి వల్ల కర్నూలు ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని అవంతి అన్నారు.