న్యూఇయర్‏లో కలిసోచ్చిన అదృష్టం.. 15‏ ఏళ్ళ క్రితం రైళ్లో పోయిన బంగారు లాకెట్.. ఇప్పుడిలా.. ‏

| Edited By: Pardhasaradhi Peri

Jan 02, 2021 | 11:06 AM

ఈ న్యూఇయర్ ఓ మహిళకు బాగా కలిసోచ్చింది. మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ పోగుట్టుకున్న బంగారు లాకెట్‏ తిరిగి ఆమె చెంతకు చేరింది.

న్యూఇయర్‏లో కలిసోచ్చిన అదృష్టం.. 15‏ ఏళ్ళ క్రితం రైళ్లో పోయిన బంగారు లాకెట్.. ఇప్పుడిలా.. ‏
Follow us on

ఈ న్యూఇయర్ ఓ మహిళకు బాగా కలిసోచ్చింది. మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ పోగుట్టుకున్న బంగారు లాకెట్‏ తిరిగి ఆమె చెంతకు చేరింది. తనకు ఇష్టమైన లాకెట్ మళ్ళీ తన దగ్గరకు చేరడంతో ఆ మహిళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

వివరాల్లోకెలితే.. మహారాష్ట్రకు చెందిన రేష్మ అనే మహిళ పదిహేళ్ళ క్రితం రైలు ప్రయాణంలో విఘ్నేశ్వరుని రూపంలో ఉన్న బంగారపు లాకెట్‏ను పోగొట్టుకుంది. దాంతో వెంటనే అక్కడి పోలీస్ స్టేషన్‏లో ఫిర్యాదు చేసింది. తనకు ఎంతో ఇష్టమైన లాకెట్ పోవడంతో ఆ మహిళ చాలా బాధపడిందట. చాలా కాలం తర్వాత పోలీసులు ఆ మహిళ పోగొట్టుకున్న లాకెట్‏ కేసును చేధించారు. అది ఆమెకు ఇవ్వడానికి చాలా సార్లు ప్రయాత్నించారట. కానీ ఫిర్యాదు సమయంలో ఆమె ఇచ్చిన అడ్రస్‏కు వెళ్ళి చూడగా.. తను అక్కడ ఉండటం లేదని తెలిసింది. దీంతో ఆ లాకెట్‏ను ఆమె ఇవ్వలేకపోయారు పోలీసులు. అప్పటి నుంచి ఆ మహిళ అడ్రస్ కోసం పోలీసులు ప్రయత్నిస్తూనే ఉన్నామని.. చివరకు ఆమె ఆధార్ నెంబర్ ఆధారంగా అడ్రస్ తెలుసుకున్నామని రైల్వే పోలీసు సీనియర్ ఇన్‏స్పెక్టర్ ఎన్‌జీ ఖాడ్కర్ తెలిపారు. న్యూూఇయర్ సందర్భంగా ఆమెకు ఆ లాకెట్ ఇవ్వాలని అనుకున్నాట్లు తెలిపారు. అనుకున్నట్లుగానే కొత్త సంవత్సరం రోజున రేష్మకు ఆ బంగారపు లాకెట్‏ను అందజేశారు. ఎన్నో సంవత్సరాల కిందట పోగొట్టున్న అదృష్టం తిరిగి తన దగ్గరకు రావడంతో రేష్మ సంతోషం వ్యక్తం చేశారు.