‘అలాంటి పదాలు వాడకండి’, కమల్ నాథ్ కి ఈసీ చురక

మధ్యప్రదేశ్ లో బీజేపీ అభ్యర్థి ఇమ్రతీ దేవిని ఉద్దేశించి 'ఐటమ్' అంటూ కాంగ్రెస్ నేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం కమల్ నాథ్ చేసిన వ్యాఖ్య పట్ల ఎన్నికల కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

అలాంటి పదాలు వాడకండి, కమల్ నాథ్ కి ఈసీ చురక

Edited By:

Updated on: Oct 27, 2020 | 12:50 PM

మధ్యప్రదేశ్ లో బీజేపీ అభ్యర్థి ఇమ్రతీ దేవిని ఉద్దేశించి ‘ఐటమ్’ అంటూ కాంగ్రెస్ నేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం కమల్ నాథ్ చేసిన వ్యాఖ్య పట్ల ఎన్నికల కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించడమేనని ఆయనకు జారీ చేసిన నోటీసులో పేర్కొంది. కమల్ నాథ్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేసిన  సంగతి తెలిసిందే. అటు జాతీయ మహిళా కమిషన్ దృష్టికి కూడా వారు ఈ విషయాన్ని తీసుకువచ్చారు. కమిషన్ సూచనపై ఈసీ….   కమల్ నాథ్ వ్యాఖ్యలను సీరియస్ గా పరిగణించింది. ఇక  బీజేపీ నేత కైలాష్ విజయ్ వర్గీయను ఉద్దేశించి కాంగ్రెస్ నేత సజ్జన్ సింగ్ వర్మ చేసిన కామెంట్ పట్ల కూడా అభ్యంతరం ప్రకటించిన ఎలెక్షన్ కమిషన్.. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.మధ్యప్రదేశ్ లో 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.

 

Follow Us