ఆన్‌లైన్‌లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్.. పట్టుబడిన ముగ్గురు బుకీలు..

|

Sep 18, 2020 | 12:37 PM

ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొబైల్ యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తోన్న ముఠాను మాచవరం పోలీసులు అరెస్టు చేశారు...

ఆన్‌లైన్‌లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్.. పట్టుబడిన ముగ్గురు బుకీలు..
Follow us on

ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొబైల్ యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తోన్న ముఠాను మాచవరం పోలీసులు అరెస్టు చేశారు. వీరికి దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు కొన్ని ఇతర దేశాలతో కూడా సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మాచవరం పిఎస్ పరిధిలోని ఓ అపార్ట్ మెంట్లో గుట్టుచప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పూర్తి సమాచారంతో అర్ధరాత్రి సమయంలో పోలీసులు దాడి నిర్వహించారు. వారి నుంచి టీవీ, ల్యాప్ టాబ్, 23 లైన్లో ఉన్న ఫోన్ బాక్స్ , 25 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు బుకీలును అదుపులోకి తీసుకోగా.. వారిలో ప్రధాన బుకీ నవీన్ కోసం గాలిస్తున్నారు. జాతీయ క్రికెట్ బుకీలతో ఉన్న సంబంధాల పై విచారణ చేస్తున్న పోలీసులు.

ఐపీఎల్ మరికొన్ని గంటల్లో మొదలు కాబోతుండగా ఇలాంటి బుకీలు రంగంలోకిదిగారు. కాయ్ రాజా కాయ్ అంటూ ఆన్ లైన్ దందాకు తెరలేపారు. ఇలాంటి మఫియాలు తెలుగు రాష్ట్రాల్లోని ఐపీఎల్ ప్రియులను వల వేసి పట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఆన్ లైన్ లో భారీగా వ్యాపారం చేసుకునేందుకు పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున ఆన్ లైన్ సరంజామాతో రెడీ అవుతున్నారు.