Lottery : వారెవ్వా.. రైతు కూలీకి తగిలిన రూ.12 కోట్ల లాటరీ..

|

Feb 14, 2020 | 4:47 PM

ఆయన ఓ రైతు కూలీ. పని ఉంటేనే పూట గడుస్తోంది. ఇప్పటికే గతంలో చేసిన లోన్లు వెంటాడుతున్నాయి. బ్యాంకు వాళ్లు అప్పులు చెల్లించకపోతే ఇల్లు జప్తు చేస్తామని తిరుగుతున్నారు. కట్ చేస్తే.. ఊహించని విధంగా అదే రైతు కూలీ ఓవర్ నైట్ కోటీశ్వరుడు అయ్యాడు. అవును అతనికి లాటరీ తగిలింది. అది కూడా 1 కాదు, 2 కాదు..ఏకంగా రూ. 12 కోట్లు. గిప్ట్ ట్యాక్సులు అన్నీ పోగా అతడికి చేతికి నిఖరంగా రూ. 7.2 కోట్లు […]

Lottery : వారెవ్వా.. రైతు కూలీకి తగిలిన రూ.12 కోట్ల లాటరీ..
Follow us on

ఆయన ఓ రైతు కూలీ. పని ఉంటేనే పూట గడుస్తోంది. ఇప్పటికే గతంలో చేసిన లోన్లు వెంటాడుతున్నాయి. బ్యాంకు వాళ్లు అప్పులు చెల్లించకపోతే ఇల్లు జప్తు చేస్తామని తిరుగుతున్నారు. కట్ చేస్తే.. ఊహించని విధంగా అదే రైతు కూలీ ఓవర్ నైట్ కోటీశ్వరుడు అయ్యాడు. అవును అతనికి లాటరీ తగిలింది. అది కూడా 1 కాదు, 2 కాదు..ఏకంగా రూ. 12 కోట్లు. గిప్ట్ ట్యాక్సులు అన్నీ పోగా అతడికి చేతికి నిఖరంగా రూ. 7.2 కోట్లు అందనుంది.

వివరాల్లోకి వెళ్తే..కేరళలోని కన్నూరలో నివశించే రాజన్ (58) రైతు కూలీగా పనిచేస్తున్నాడు. అయితే అతనికి ఓ అలవాటు ఉంది. అదే లాటరీలు తీయడం. ఏ రోజైనా ఈ పేదవాడ్ని లక్ష్మీదేవీ కనికరించకపోతుందా అని ఆయన ఆశ. అందుకే తనకు వచ్చే కూలి డబ్బులో ఎక్కువ మొత్తాన్ని లాటరీలు తీయడానికే ఖర్చపెడతాడు. ఇప్పటివరకు ఆయన మూడు సార్లు మాత్రమే..రూ.500 చొప్పున లాటరీలు గెలిచారు. ఇటీవల అలవాటులో భాగంగా క్రిస్మస్ సందర్భంగా కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన లాటరీ స్కీమ్‌‌లో టికెట్ కొన్నాడు రాజన్. ఊహించని విధంగా ఆయనకు ఈ సారి లక్ కలిసొచ్చి రూ. 12 కోట్లు టికెట్ తగిలింది. దీంతో రాజన్‌తో పాటు ఆయన కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. ఎక్కువ అమౌంట్ గెలవాలని రాజన్ ప్రతిరోజు 5 టికెట్లు కొనుగోలు చేసేవాడినని తెలిపాడు. వచ్చిన డబ్బుతో ముందుగా తనకున్న రూ. 5 లక్షల అప్పు తీరుస్తానని.. ఆ తర్వాత మిగతా విషయాల గురించి ఆలోచిస్తానని చెప్పుకొచ్చాడు.