మీడియా ముందుకు బాలుడు దీక్షిత్ రెడ్డి తల్లిదండ్రులు

|

Oct 28, 2020 | 12:13 PM

ఇటీవల కిడ్నాపర్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన దీక్షిత్ రెడ్డి తల్లిదండ్రులు మీడియా ముందుకొచ్చారు. మహబూబాబాద్ జిల్లా(పాత వరంగల్ జిల్లా) శనిగపురంలోని వాళ్ల ఇంటిలో మీడియాతో పలు అంశాలు ప్రస్తావించారు. “మా కొడుకు కిడ్నప్ & హత్య మా కుటుంబానికి ఇప్పటికీ తీరనిలోటు.. 300 మంది పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. అయినా దీక్షిత్ రెడ్డి ఆచూకి లభించలేదు.. మీడియా, పోలీసులు బాగా కష్ట పడ్డారు. దీక్షిత్ రెడ్డి క్షేమంగా వస్తాడని ఎదురు చూశారు. పోలీసుల కస్టడీలో ఉన్న […]

మీడియా ముందుకు బాలుడు దీక్షిత్ రెడ్డి తల్లిదండ్రులు
Follow us on

ఇటీవల కిడ్నాపర్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన దీక్షిత్ రెడ్డి తల్లిదండ్రులు మీడియా ముందుకొచ్చారు. మహబూబాబాద్ జిల్లా(పాత వరంగల్ జిల్లా) శనిగపురంలోని వాళ్ల ఇంటిలో మీడియాతో పలు అంశాలు ప్రస్తావించారు. “మా కొడుకు కిడ్నప్ & హత్య మా కుటుంబానికి ఇప్పటికీ తీరనిలోటు.. 300 మంది పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. అయినా దీక్షిత్ రెడ్డి ఆచూకి లభించలేదు.. మీడియా, పోలీసులు బాగా కష్ట పడ్డారు. దీక్షిత్ రెడ్డి క్షేమంగా వస్తాడని ఎదురు చూశారు. పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడు మంద సాగర్ ను మరోసారి విచారించి, పోలీసులు మా కుటుంబానికి న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది.. దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ ఉదంతాన్ని చూసి హైదరాబాద్ లో మరో ఘటన జరిగింది. నేరస్తులకు భవిష్యత్ లో ఇది రోల్ మోడల్ గా మారే అవకాశం ఉంది. దేశంలో తెలంగాణ పోలీసులు అన్నిరంగాల్లో ముందున్నారు. కానీ దురదృష్టవశాత్తు దీక్షత్ తిరిగిరాలేదు ఇది మా దురదృష్టం. ఇప్పటికైనా నేరస్తుడికి మరణ శిక్షపడే విధంగా పోలీసులు కృషి చేయాలని ఎదురు చూస్తున్నాము.” అని ఆ తల్లిదండ్రులు బరువెక్కిన గుండెలతో మాట్లాడారు. ‘బాలుడు దీక్షిత్‌ ను చంపిన వాడు ఎన్ కౌంటర్’ వార్తలు అవాస్తవం: ఎస్పీ ప్రెస్ మీట్