ఇవాళ అరుణ్‌జైట్లీ అంత్యక్రియలు

| Edited By: Ravi Kiran

Aug 25, 2019 | 9:56 AM

కేంద్ర ఆర్థిక శాఖ మాజీమంత్రి అరుణ్‌ జైట్లీ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. కుటుంబసభ్యులు, సన్నిహితుల సందర్శనార్థం జైట్లీ పార్థివ దేహాన్ని ఆదివారం ఉదయం వరకూ ఢిల్లీలోని కైలాస్ కాలనీలోగల ఆయన నివాసంలోనే ఉంచనున్నారు. అనంతరం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ పార్టీ శ్రేణుల సందర్శనార్థం బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఉంచుతారు. సాయంత్రం నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అనారోగ్య కారణాలతో ఈ నెల 9న జైట్లీ ఎయిమ్స్‌లో చేరిన […]

ఇవాళ  అరుణ్‌జైట్లీ అంత్యక్రియలు
Follow us on

కేంద్ర ఆర్థిక శాఖ మాజీమంత్రి అరుణ్‌ జైట్లీ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. కుటుంబసభ్యులు, సన్నిహితుల సందర్శనార్థం జైట్లీ పార్థివ దేహాన్ని ఆదివారం ఉదయం వరకూ ఢిల్లీలోని కైలాస్ కాలనీలోగల ఆయన నివాసంలోనే ఉంచనున్నారు. అనంతరం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ పార్టీ శ్రేణుల సందర్శనార్థం బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఉంచుతారు. సాయంత్రం నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అనారోగ్య కారణాలతో ఈ నెల 9న జైట్లీ ఎయిమ్స్‌లో చేరిన జైట్లీ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.