ఒడిశాలో ప్రపంచ స్థాయి హాకీ స్టేడియం.. వరల్డ్ కప్ టోర్నీకి వేదికగా మారనున్న భువనేశ్వర్​

|

Jan 20, 2021 | 6:42 AM

డియం భారత్​లోనే పెద్ద హాకీ స్టేడియంగా నిలవబోతోందని డిశా ప్రధాన కార్యదర్శి సురేశ్ చంద్ర మహోపాత్ర వెల్లడించారు. బీపీటీయూ క్యాంపస్​లో దీనిని నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. మూడు, నాలుగు నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని..

ఒడిశాలో ప్రపంచ స్థాయి హాకీ స్టేడియం.. వరల్డ్ కప్ టోర్నీకి వేదికగా మారనున్న భువనేశ్వర్​
Follow us on

Largest Hockey Stadium : ప్రపంచ స్థాయి హాకీ స్టేడియాన్ని ఒడిశాలో నిర్మించేందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి.  20 వేల సీటింగ్​ సామర్థ్యంతో దేశంలో ఇది అతిపెద్ద హాకీ స్టేడియంగా అవతరించనుంది.

రూర్కెలాలోని బిజు పట్నాయక్ సాంకేతిక విశ్వవిద్యాలయ క్యాంపస్​లో ఈ స్టేడియాన్ని నిర్మస్తున్నారు. 2023లో జరిగే పురుషుల హాకీ ప్రపంచకప్​నకు ఇది రెండో వేదికగా మారనుంది. వరల్డ్ కప్ టోర్నీని భువనేశ్వర్​లోనూ నిర్వహించనున్నారు.

ఈ స్టేడియం భారత్​లోనే పెద్ద హాకీ స్టేడియంగా నిలవబోతోందని డిశా ప్రధాన కార్యదర్శి సురేశ్ చంద్ర మహోపాత్ర వెల్లడించారు. బీపీటీయూ క్యాంపస్​లో దీనిని నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. మూడు, నాలుగు నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని.. ఏడాదిలోగా పూర్తవుతాయని తెలిపారు .

పార్కింగ్ సహా ఇతర సదుపాయాల కల్పనకు కూడా పనులు అప్పుడే ప్రారంభమవుతాయని సీఎస్ వెల్లడించారు. 15 ఎకరాల్లో 20 వేల సీటింగ్​ సామర్థ్యంతో ఈ స్టేడియాన్ని రూపొందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Sania Mirza Corona Positive : సానియా మీర్జాకు కరోనా పాజిటివ్.. ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదన్న టెన్నిస్ స్టార్

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చివరి రోజు.. అఖరి నిమిషం ఇలా.. గన్ సల్యూట్ కోసం భారీ ఏర్పాట్లు