AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో క‌రోనా క‌ల్లోలం : తొలిసారిగా 90వేల‌కు పైగా కేసులు

భారత్‌లో కరోనా వైరస్ తీవ్ర‌త కొన‌సాగుతోంది. నిత్యం రికార్డుస్థాయిలో పాజిటివ్‌ కేసులు న‌మోద‌వుతున్నాయి. గడిచిన 24గంటల్లో రికార్డ్ లెవ‌ల్‌లో 90,632 మందికి వైర‌స్ సోకింది.

దేశంలో క‌రోనా క‌ల్లోలం : తొలిసారిగా 90వేల‌కు పైగా కేసులు
Ram Naramaneni
|

Updated on: Sep 06, 2020 | 11:20 AM

Share

భారత్‌లో కరోనా వైరస్ తీవ్ర‌త కొన‌సాగుతోంది. నిత్యం రికార్డుస్థాయిలో పాజిటివ్‌ కేసులు న‌మోద‌వుతున్నాయి. గడిచిన 24గంటల్లో రికార్డ్ లెవ‌ల్‌లో 90,632 మందికి వైర‌స్ సోకింది. ఒక్కరోజు వ్యవధిలో 90వేల మార్కును దాటడం ఇదే తొలిసారి. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఒక్కరోజు వ్యవధిలో ఇన్ని కేసులు వెలుగుచూడ‌లేదు. దీంతో ఆదివారం నాటికి భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 41,13,811 చేరింది. ఫ‌లితంగా కరోనా కేసుల్లో ప్రపంచంలోనే సెకండ్ ప్లేసులో ఉన్న బ్రెజిల్‌కు ఇండియా చేరువయ్యింది. బ్రెజిల్‌లో ఇప్పటి వరకు 41లక్షల 23వేల కేసులు నమోదయ్యాయి. భారత్‌లో నమోదైన మొత్తం కేసుల్లో ఇప్పటికే 31లక్షల మంది రిక‌వ‌ర్ అవ్వ‌గా మరో 8లక్షల యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 77శాతం దాటింది. మరణాల రేటు 1.7శాతంగా కొనసాగుతోంది.

దేశంలో మొత్తం కేసులు 41,13,811 కొత్త కేసులు 90,632 ప్ర‌స్తుతం దేశంలో యాక్టీవ్ కేసులు 8,62,320 దేశంతో మొత్తం క‌రోనాతో చ‌నిపోయిన‌వారు 70,626 శ‌నివారం మృతుల సంఖ్య ‌1065

Also Read :

జ‌గ‌న్‌పై దాడి కేసు: హైకోర్టును ఆశ్రయించిన నిందితుడు శ్రీనివాసరావు

శిరోముండనం కేసులో నూతన్​ నాయుడుకు రిమాండ్