చావు చివరి అంచుల దాకా వెళ్లింది.. !

|

Jun 02, 2020 | 9:36 PM

అతి పొడవైన పైథాన్‌ ఒక్కసారిగా జింక పిల్లను చుట్టేసింది. కొండ చిలువకు ఆహారమయ్యే ప్రాణాపాయస్థితి నుంచి జింక క్షేమంగా బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చావు చివరి అంచుల దాకా వెళ్లింది.. !
Follow us on

అతి పొడవైన పైథాన్‌ ఒక్కసారిగా జింక పిల్లను చుట్టేసింది. క్షణాల వ్యవధిలో మింగేసేందుకు యత్నించింది. కొండ చిలువకు ఆహారమయ్యే ప్రాణాపాయస్థితి నుంచి జింక క్షేమంగా బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కొండ చిలువ బారినపడి ప్రాణాలతో బయటపడటం అంత సులభం కాదు. అవి మనుషుల్ని, జంతువులన్ని ఇట్టే పట్టేసుకుంటాయి. అయితే, కొండ చిలువకు ఆహారమయ్యే ప్రాణాపాయ పరిస్థితుల నుంచి ఒక జింక క్షేమంగా బయటపడింది. దీనికి సంబంధించిన వీడియోను డుసిత్ జూ అసిస్టెంట్ డైరెక్టర్ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. థాయ్‌లాండ్‌లోని ఖావో ఖేవ్ ఓపెన్ జూలో ఈ వీడియోను తీసినట్లు తెలిపారు. ఈ వీడియో​ ప్రస్తుతం అన్ని సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
ఓ భారీ పైథాన్‌ ఓపన్‌ జూలో ఉన్న ఓ రోడ్డుపై నుంచి వెళ్తున్న చిన్న జింక పిల్లను చుట్టుకొని మింగేయడానికి ప్రయత్నించింది. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ యువకుడు చెట్టు కొమ్మతో కొండచిలువను కొట్టడంతో కోపంతో ఒక్కసారిగా అతనిపై దాడి చేయబోయింది. ఇక యువకుడు మరోసారి ధైర్యం చేసి కొట్టడంతో భయంతో కొండ చిలువ జింకను వదిలి చెట్ల పొదల్లోకి పారిపోయింది. దీంతో జింక బ్రతుకు జీవుడా అంటూ లగెత్తింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్లతో ముంచెత్తారు. అది అంతంగా అసక్తి కలిగించిన ఈ వీడియోను ఇప్పటి వరకు పది లక్షల మంది వీక్షించగా, 17 వేల మంది లైక్‌ చేశారు.