AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విషం తాగి భర్త ఆత్మహత్య.. చెరువులో దూకిన భార్య, ఇద్దరు పిల్లలు..

హర్యానా రాష్ట్రంలో ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ ఆత్మ‌హ‌త్య చేసుకోగా, భర్త మరణం తట్టుకోలేక భార్య‌, ఇద్ద‌రు కూతుళ్లు చెరువులో దూకి ఆత్మహత్య పాల్పడ్డారు.

విషం తాగి భర్త ఆత్మహత్య.. చెరువులో దూకిన భార్య, ఇద్దరు పిల్లలు..
Balaraju Goud
|

Updated on: Sep 24, 2020 | 2:47 PM

Share

హర్యానా రాష్ట్రంలో ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ ఆత్మ‌హ‌త్య చేసుకోగా, భర్త మరణం తట్టుకోలేక భార్య‌, ఇద్ద‌రు కూతుళ్లు చెరువులో దూకి ఆత్మహత్య పాల్పడ్డారు. ఈ ఉదంతంలో భార్య, భర్తలతోపాటు నాలుగేళ్ల చిన్నారి మృతి చెందగా, పదేళ్ల మరో అమ్మాయి ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

హ‌ర్యానాలోని రోహ‌త‌క్‌ ప్రాంతానికి చెందిన ప్ర‌మోద్ ష‌హార‌ణ్(38) స్థానికంగా ఉన్న ఓ న‌ర్సింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. ప్ర‌మోద్ భార్య మీనాక్షి కూడా లెక్చ‌ర‌ర్ గా పనిచేస్తోంది. వీరికి ఎన్నా(10), ప్రీశా(4) అనే ఇద్ద‌రు కూతుళ్లు ఉన్నారు. అయితే బుధవారం ప్ర‌మోద్ బుధ‌వారం విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వ‌స్తూనే మార్గ‌మ‌ధ్య‌లోనే విషం సేవించి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఆత్మ‌హ‌త్య కంటే ముందు ఈ విష‌యాన్ని త‌న స్నేహితుల‌కు వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలియ‌జేశాడు. దీంతో మిత్రులు హుటాహుటిన అక్క‌డికి చేరుకుని ప్ర‌మోద్‌ను ఆస్ప‌త్రికి తీసుకెళ్లిన‌ప్ప‌టికీ, అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్దారించారు.

భ‌ర్త ఆత్మ‌హ‌త్య విష‌యం మీనాక్షికి తెలియడంతో.. ఆమె కూడా త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌ను తీసుకుని స్థానికంగా ఉన్న చెరువులో పిల్ల‌ల‌ను తోసేసి ఆమె దూకింది. మీనాక్షి, ప్రీశా నీటిలో మునిగిపోగా, ఎన్నా ప్రాణాల‌తో ఒడ్డుకు చేరింది. ప్రాణాలతో బయటపడ్డ ఎన్నా స్థానికులకు సమాచారమిచ్చింది. దీంతో వారు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. చెరువులో నుంచి మీనాక్షి, ప్రీశా మృత‌దేహాల‌ను గురువారం ఉద‌యం వెలికితీశారు. అయితే ప్ర‌మోద్‌, మీనాక్షి ఆత్మ‌హ‌త్య‌ల‌కు గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంద‌ని పోలీసులు తెలిపారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Follow Us
ట్రై సిరీస్‌లో భారత్‌కు షాక్.. 4 పరుగుల తేడాతో అఫ్ఘాన్ విజయం
ట్రై సిరీస్‌లో భారత్‌కు షాక్.. 4 పరుగుల తేడాతో అఫ్ఘాన్ విజయం
క్రెడిట్ కార్డులు వాడేవారికి షాక్
క్రెడిట్ కార్డులు వాడేవారికి షాక్
ఒకప్పుడు చాక్లెట్స్ అమ్మింది.. ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్
ఒకప్పుడు చాక్లెట్స్ అమ్మింది.. ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్
పూరీ జగన్నాథ రథయాత్రకు వెళ్తున్నారా? భక్తులు తప్పక పాటించాల్సిన..
పూరీ జగన్నాథ రథయాత్రకు వెళ్తున్నారా? భక్తులు తప్పక పాటించాల్సిన..
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. తాగునీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం..
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. తాగునీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం..
వెనిజులా సీన్ రిపీట్ అవ్వబోతుంది.. ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్
వెనిజులా సీన్ రిపీట్ అవ్వబోతుంది.. ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్
లోన్లు తీసుకునేవారికి ఆర్బీఐ షాక్
లోన్లు తీసుకునేవారికి ఆర్బీఐ షాక్
మందారం పూలు గుత్తులుగా పూయాలంటే జస్ట్ ఇలా చేయండి..
మందారం పూలు గుత్తులుగా పూయాలంటే జస్ట్ ఇలా చేయండి..
CBSEకి షాకిచ్చిన యువకుడికి ఐఐటీ కాన్పూర్ నుంచి సూపర్ ఛాన్స్..!
CBSEకి షాకిచ్చిన యువకుడికి ఐఐటీ కాన్పూర్ నుంచి సూపర్ ఛాన్స్..!
హిందూ సంప్రదాయం ప్రకారం పుట్టినరోజును ఎలా జరుపుకోవాలో మీకు తెలుసా
హిందూ సంప్రదాయం ప్రకారం పుట్టినరోజును ఎలా జరుపుకోవాలో మీకు తెలుసా