8 ఏళ్ల బాలుడిని గొంతుకోసి చంపిన పిన్ని

గుంటూరు జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. సొంత పిన్ని ఎనిమిదేళ్ల బాలుడిని అతికిరాతకంగా హతమార్చింది.

8 ఏళ్ల బాలుడిని గొంతుకోసి చంపిన పిన్ని

Updated on: Oct 04, 2020 | 2:52 PM

గుంటూరు జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. సొంత పిన్ని ఎనిమిదేళ్ల బాలుడిని అతికిరాతకంగా హతమార్చింది. చిలకలూరిపేటకు చెందిన దంపతు కుమారుడు ఎనిమిదేళ్ల కరీముల్లా. అయితే, కరీముల్లాను ఇంట్లో నిందితురాలు అయిన ఆసియా వద్ద ఉంచిన దంపతులిద్దరు బయటకు వెళ్లారు. అయితే, కరీముల్లానుపిన్ని ఆసియా గొంతుకోసి అతిదారుణంగా చంపేసింది. దీంతో ఆ బాలుడు రక్తపు మడుగులోపడి విలవిలలాడుతూ అక్కడిక్కడే కన్నుమూశాడు. బాలుడి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, నిందితురాలు మానసిక వికలాంగురాలుగా భావిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేుసుకుని దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us