శభాష్ పోలీస్ అన్నా…

| Edited By: Ravi Kiran

Aug 11, 2019 | 4:23 PM

పోలీస్.. న్యాయానికి, ధర్మానికి, త్యాగానికి మాత్రమే చిహ్నం కాదు.. ఆపదలో ఉన్న ప్రజలను కూడా ఆదుకోడానికి కూడా కేరాఫ్ అని రుజువు చేశాడు ఓ పోలీస్. విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి ఇద్దరు చిన్నారులను కాపాడిన ఓ కానిస్టేబుల్‌‌కు దేశం యావత్తు సెల్యూట్ చేస్తోంది. గుజరాత్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం భారీ వర్షాలతో గుజరాత్ అతలాకుతమైంది. ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, సైన్యం రంగంలోకి దిగి నిత్యం సహాయక చర్యలు చేపడుతున్నాయి. వరదప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలను ముమ్మరం […]

శభాష్ పోలీస్ అన్నా...
Follow us on

పోలీస్.. న్యాయానికి, ధర్మానికి, త్యాగానికి మాత్రమే చిహ్నం కాదు.. ఆపదలో ఉన్న ప్రజలను కూడా ఆదుకోడానికి కూడా కేరాఫ్ అని రుజువు చేశాడు ఓ పోలీస్. విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి ఇద్దరు చిన్నారులను కాపాడిన ఓ కానిస్టేబుల్‌‌కు దేశం యావత్తు సెల్యూట్ చేస్తోంది. గుజరాత్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం భారీ వర్షాలతో గుజరాత్ అతలాకుతమైంది. ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, సైన్యం రంగంలోకి దిగి నిత్యం సహాయక చర్యలు చేపడుతున్నాయి. వరదప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలను ముమ్మరం చేశారు. అలా ఓ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలు చేపట్టిన పోలీసులకు.. ఓ చోట ఇద్దరు చిన్నారులు భయాందోళనలో కనిపించారు. ఎటు చూసినా కనుచూపుమేర వరదనీళ్లే కనపడుతున్నాయి. ఒడ్డుకు చేరే పరిస్థితే లేదు. తీవ్ర భయాందోళనతో ఉన్నవారిని.. పృథ్విరాజ్ సింగ్ జడేజా అనే పోలీస్ కానిస్టేబుల్ తన భుజాలపైకి ఎత్తుకుని గట్టుకు చేర్చారు. ఆ ఇద్దరు చిన్నారులను కింద పడకుండా జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చిన ఘటనను అక్కడే ఉన్న ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విషయం గుజరాత్ సీఎం విజయ్ రూపానీ దృష్టికి వెళ్లగా.. సదరు కానిస్టేబుల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ట్విట్టర్‌లో వీడియోను అప్‌లోడ్ చేసిన ఆయన.. ప్రతికూల పరిస్థితుల్లోనూ కఠినశ్రమ, సంకల్పం, అంకితభావాలతో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు పృథ్విరాజ్ సింగ్ జడేజా ఓ ఉదాహరణగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. వారి నిబద్ధతను అంతా అభినందించండంటూ సీఎం విజయ్‌ రూపానీ ట్వీట్ చేశారు.