ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ఊరట..!

|

Jul 30, 2020 | 4:31 AM

లాక్ డౌన్ లో హాజరుకాని ఉద్యోగులకు కేంద్రం ఊరట నిచ్చింది. కొవిడ్‌-19 కారణంగా విధించిన లాక్‌డౌన్‌లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సర్వీసుకు సంబంధించిన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమనం కల్పించింది.

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ఊరట..!
Follow us on

లాక్ డౌన్ లో హాజరుకాని ఉద్యోగులకు కేంద్రం ఊరట నిచ్చింది. కొవిడ్‌-19 కారణంగా విధించిన లాక్‌డౌన్‌లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సర్వీసుకు సంబంధించిన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమనం కల్పించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన డీవోపీటీ కార్యాలయం తాజాగా మెమో జారీచేసింది. ప్రభుత్వ ఉద్యోగులు అధికారిక టూర్‌లో ఉన్న సమయంలో లాక్‌డౌన్‌ విధించింది కేంద్రం. ఈ సమయంలో ఎక్కడి వారక్కడే ఉండిపోయారు. దీంతో సర్వీసు రూల్స్ సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కేంద్ర క్లారిటీనిచ్చింది. రవాణా సౌకర్యాలు లేక తిరిగి హెడ్‌క్వార్టర్స్‌లో విధులకు హాజరు కాలేకపోయినప్పటికీ, ఉన్నతాధికారులకు ఏ రూపంలోనైనా సమాచారమిచ్చి ఉంటే వారు తిరిగి విధుల్లో చేరినట్లుగా భావిస్తున్నట్లు పేర్కొంది. దీంతో లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలకు దూరమైన వారికి కొంత ఉపశమనం దొరికింది. కేంద్ర నిర్ణయం పట్ల ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.