వరుసగా రెండో రోజూ లాభాలతో ట్రేడవుతోన్న బంగారం, వెండి. ఎంసీఎక్స్‌ తోపాటు, న్యూయార్క్‌ కామెక్స్‌లోనూ సువర్ణ దూకుడు

|

Dec 16, 2020 | 12:26 PM

అంతర్జాతీయంగా పసిడికి సానుకూల పవనాలు వీస్తుండటంతో నేటితో వరుసగా రెండో రోజూ బంగారం, వెండి లాభాలతో ట్రేడవుతున్నాయి. ఎంసీఎక్స్‌లో..

వరుసగా రెండో రోజూ లాభాలతో ట్రేడవుతోన్న బంగారం, వెండి. ఎంసీఎక్స్‌ తోపాటు,  న్యూయార్క్‌ కామెక్స్‌లోనూ సువర్ణ దూకుడు
Follow us on

అంతర్జాతీయంగా పసిడికి సానుకూల పవనాలు వీస్తుండటంతో నేటితో వరుసగా రెండో రోజూ బంగారం, వెండి లాభాలతో ట్రేడవుతున్నాయి. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 137 పుంజుకుని రూ. 49,580 వద్ద ట్రేడవుతోంది. తొలుత 49,510 వద్ద కనిష్టంగా ప్రారంభమై, తదుపరి రూ. 49,626 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇక వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్‌ సైతం రూ. 318 వృద్ధితో రూ. 65,171 వద్ద కదులుతోంది. రూ. 65,000 వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో రూ. 65,324 వద్ద గరిష్టానికి చేరింది. అటు, న్యూయార్క్‌ కామెక్స్‌లోనూ వీటి దూకుడు కొనసాగుతోంది. ప్రస్తుతం పసిడి ఔన్స్‌ 0.3 లాభంతో 1,861 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్‌ మార్కెట్లోనూ 0.2 శాతం బలపడి 1,857 డాలర్లను అధిగమించింది. వెండి మరింత అధికంగా ఔన్స్ 0.75 శాతం పెరిగి 24.83 డాలర్ల వద్ద కదులుతోంది. బులియన్‌ వర్గాల అంచనాల ప్రకారం పసిడికి 1870-1884 డాలర్ల వద్ద రెసిస్టెన్స్‌ కనిపించవచ్చు. ఇదేవిధంగా 1840-1828 డాలర్ల వద్ద సపోర్ట్‌ లభించే వీలుంది. ఈ నెల 18న యూఎస్‌ కాంగ్రెస్‌ సహాయక ప్యాకేజీపై సమీక్షను చేపట్టే వీలున్నట్లు వెలువడిన వార్తలు పసిడికి జోష్‌ నిచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.