ఆ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేకు కరోనా..

| Edited By:

Jul 01, 2020 | 9:17 AM

కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ మహమ్మారి భారత్ లో కూడా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. ఈ క్రమంలో గోవా రాష్ట్రంలో ఓ బీజేపీ ఎమ్మెల్యే కరోనా వైరస్ బారిన పడ్డారు. దక్షిణ గోవాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేకు

ఆ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేకు కరోనా..
Follow us on

Goa BJP MLA tests Covid 19 positive: కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ మహమ్మారి భారత్ లో కూడా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. ఈ క్రమంలో గోవా రాష్ట్రంలో ఓ బీజేపీ ఎమ్మెల్యే కరోనా వైరస్ బారిన పడ్డారు. దక్షిణ గోవాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేకు కరోనా వైరస్ పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో అతన్ని ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించామని గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు. గోవా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1198 కి చేరాయి. 478 మంది కరోనా నుంచి కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని, మరో ముగ్గురు మరణించారని సీఎం చెప్పారు.