జోగులాంబ జిల్లా గద్వాల మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు కన్నుమూశారు. గుండెపోటుతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం హైదరాబాద్ నిమ్స్లో మరణించారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఒకప్పుడు రాష్ట్రంలో బెల్ట్ షాపులపై నిరసన గళమిప్పిన భీముడు గొంతు ఇప్పుడు మూగబోయింది. 1999లో భీముడు మొదటిసారి టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.