జోగులాంబ జిల్లా గద్వాల మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాష్ట్రంలో బెల్టు షాపులపై గళమెత్తిన గట్టు భీముడు.. గద్వాల నియోజకవర్గం నుంచి 1999లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. భీముడి మృతి చెందడం పట్ల మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణలు సంతాపం ప్రకటించారు.