AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పచ్చని పంటపొలాల మధ్య గ్యాస్ ​పైప్​లైన్ వద్దే వద్దు.. జోగులాంబ గద్వాల జిల్లాలో గ్రామస్థుల ఆందోళన

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ కర్ణాటక హాసన్ జిల్లా నుంచి రాష్ట్రంలోని చర్లపల్లి వరకు గ్యాస్ పైప్​లైన్ వేస్తున్న

పచ్చని పంటపొలాల మధ్య గ్యాస్ ​పైప్​లైన్ వద్దే వద్దు.. జోగులాంబ గద్వాల జిల్లాలో గ్రామస్థుల ఆందోళన
uppula Raju
|

Updated on: Jan 14, 2021 | 3:19 PM

Share

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ కర్ణాటక హాసన్ జిల్లా నుంచి రాష్ట్రంలోని చర్లపల్లి వరకు గ్యాస్ పైప్​లైన్ వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పైప్‌లైన్  జోగులాంబ గద్వాల జిల్లా మీదుగా వస్తోంది. అయితే ఈ పైప్‌లైన్‌ను వ్యతిరేకిస్తూ మనవపాడ్ మండలం గోకులపాడ్ శివారులో గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించారు. పచ్చని పంట పొలాల మధ్య గ్యాస్ పైప్​లైన్ వెళ్లనిచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు. ఈ ఆందోళన వల్ల రాయచూర్-కర్నూల్ అంతర్రాష్ట్ర రహదారిపై ఇరువైపుల వాహనాలు భారీగా నిలిచిపోయాయి. గ్యాస్ పైప్ లైన్ తమ పొలాల్లోంచి పోవడాన్ని వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని గ్రామస్థులు చెబుతున్నారు.

తక్షణమే గ్యాస్ పైప్లైన్ పనులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. మాకు గ్యాస్ పైప్​లైన్ వద్దని కలెక్టర్​కు కూడా వినతి పత్రం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇంత వరకు ఏ అధికారి కూడా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేమందరం నేలతల్లిని నమ్ముకొని బతుకుతున్నాం. మా ఊరిలో అందరు చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. ఉన్న ఎకరా, రెండెకరాల పొలంలో గ్యాస్ లైన్ వేస్తే మా పరిస్థితి ఎట్లా? ఏపీలో గ్యాస్ పైప్​లైన్ లీక్ కావడం వల్ల అనేక అనార్థాలు జరుగుతున్నాయి. ఎకరా పొలం ప్రస్తుత మార్కెట్ ప్రకారం రూ. 40 లక్షలు ఉంది. మేమంతా వ్యతిరేకిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. గ్యాస్ పైప్​లైన్ వెళ్లే పొలాల రైతులకు ఎకరాకు రూ. 50,000 ఇస్తామని చెప్పి డబ్బు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదని వాపోయారు. తమకు డబ్బు వద్దు గ్యాస్ లైన్ వద్దని రైతులు కరాకండిగా చెబుతున్నారు. పైప్​లైన్ నిర్మాణాన్ని కచ్చితంగా అడ్డుకుంటామని తెలిపారు.

జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్‌లో ప్రోటోకాల్ వివాదం.. ఇలా ప్రారంభించారు..అలా ధ్వంసం చేశారు

Follow Us
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ
పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?
పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి