కరోనా ప్రపంచవ్యాప్తంగా మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. దీని భారినపడి ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్థాన్ మాజీ ఫస్ట్క్లాస్ క్రికెటర్ జాఫర్ సర్ఫరాజ్(50).. కోవిడ్ తో బాధపడుతూ మంగళవారం తుదిశ్వాస విడిచాడు. గత 3 రోజుల నుంచి పెషావర్లోని ఓ హాస్పటల్ ఐసీయూలో ఉన్న జాఫర్.. కరోనాతో మరణించిన తొలి పాకిస్థాన్ క్రికెటర్. 10 నెలల క్రితం క్యాన్సర్ పై పోరాడి ప్రాణాలు విడిచిన పాక్ మాజీ ఆటగాడు అక్తర్ సర్ఫరాజ్ ఇతడికి సోదరుడు.
1988లో క్రికెట్ కెరీర్ ప్రారంభించిన సర్ఫరాజ్.. పెషావర్ తరఫున 15 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 616 రన్స్ చేశాడు. 6 వన్డేలాడి 96 రన్స్ సాధించాడు. 1994లో రిటైర్మెంట్ ప్రకటించాడు. అనంతరం 2000 సంవత్సరంలో పెషావర్కు చెందిన సీనియర్, అండర్-19 జట్లకు కోచ్గానూ సేవలందించాడు.