బీజేపీ గూటికి అల్పేశ్ ఠాకూర్!

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అల్పేశ్ ఠాకూర్ బీజేపీలో చేరారు. తన సన్నిహితుడైన మరో ఎమ్మెల్యే ధావల్ సింగ్ ఝాలాతో కలిసి కమల దళంలో చేరారు. వీరిద్దరినీ గుజరాత్ బీజేపీ ఛీఫ్ జీతూ వఘానీ అహ్మదాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో పార్టీలోకి ఆహ్వానించారు. గుజరాత్ క్షత్రియ ఠాకూర్ సేన అధినేత అల్పేశ్‌కు తమ సామాజిక వర్గంలో గట్టి పట్టుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించిన అల్పేశ్ ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ […]

బీజేపీ గూటికి అల్పేశ్ ఠాకూర్!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 19, 2019 | 6:20 AM

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అల్పేశ్ ఠాకూర్ బీజేపీలో చేరారు. తన సన్నిహితుడైన మరో ఎమ్మెల్యే ధావల్ సింగ్ ఝాలాతో కలిసి కమల దళంలో చేరారు. వీరిద్దరినీ గుజరాత్ బీజేపీ ఛీఫ్ జీతూ వఘానీ అహ్మదాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో పార్టీలోకి ఆహ్వానించారు. గుజరాత్ క్షత్రియ ఠాకూర్ సేన అధినేత అల్పేశ్‌కు తమ సామాజిక వర్గంలో గట్టి పట్టుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించిన అల్పేశ్ ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేశారు. చివరకు బీజేపీలో చేరారు. ఒకప్పుడు మోదీని తీవ్రంగా విమర్శించిన అల్పేశ్ చివరకు కమలనాథుల చెంత చేరడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

Latest Articles