జమ్మూకాశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లు: ఐదుగురు ఉగ్రవాదులు మృతి

| Edited By:

Mar 22, 2019 | 12:05 PM

జమ్మూకాశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. 24 గంటల్లో జరిగిన నాలుగు ఎన్‌కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్ ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదులను కడతేర్చడానికి సైన్యం భారీ ఆపరేషన్ చేపట్టింది. రాష్ట్రీయ రైఫిల్స్ బలగాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. కాగా.. షోపియాన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు నక్కినట్టు భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో.. ప్రత్యేక బలగాలు గాలింపు చర్యలను చేపట్టాయి. బందిపురలోని హాజిన్ ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. […]

జమ్మూకాశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లు: ఐదుగురు ఉగ్రవాదులు మృతి
Follow us on

జమ్మూకాశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. 24 గంటల్లో జరిగిన నాలుగు ఎన్‌కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్ ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదులను కడతేర్చడానికి సైన్యం భారీ ఆపరేషన్ చేపట్టింది. రాష్ట్రీయ రైఫిల్స్ బలగాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.

కాగా.. షోపియాన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు నక్కినట్టు భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో.. ప్రత్యేక బలగాలు గాలింపు చర్యలను చేపట్టాయి. బందిపురలోని హాజిన్ ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. లష్కర్ ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రరిస్టులను సైన్యం హతమార్చింది. మృతుల్లో పాకిస్తాన్‌కు చెందిన లష్కర్ కమాండ్ అలీభాయ్ కూడా ఉన్నాడు.