నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, ఐదుగురి దుర్మరణం
హైదరాబాద్-నాగార్జునసాగర్ రహదారిపై శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ యాక్సిడెంట్లో ఐదుగురు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు.
హైదరాబాద్-నాగార్జునసాగర్ రహదారిపై శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ యాక్సిడెంట్లో ఐదుగురు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. చింతపల్లి మండలం ధైర్యపురి తండా వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడటంతో, వాహనంలోని ఐదుగురు మృతి చెందారు. హైదరాబాద్నుంచి మల్లెపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.
వాహనం నడిపిన వ్యక్తి నిద్రలోకి జారుకోవడమే ఈ యాక్సిడెంట్కు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు స్పాట్కు చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. అతివేగం, నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. కారులోని డెడ్బాడీలను బయటకు తీసి, పోస్ట్మార్టం కోసం తరలించారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read :
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఇంట విషాదం