Fire accident: హైదరాబాద్ లోని చందానగర్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మలబార్ నగల దుకాణం భవనం లో ఒక్క సరిగా మంటలు చెలరేగాయి. అదే భవనంలో బిర్యాని రెస్టారెంట్ కి సంబంధించిన కిచెన్ లో నుండి మంటలు చేలరేగినట్టు స్థానికులు తెలిపారు. స్థానికులు మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. పక్కనే ఆర్ ఎస్ బ్రదర్స్, ఇంకో హోటల్ కూడా ఉండటంతో చుట్టూ ప్రక్కల ఉండే స్థానికుల ఆందోళన చెందుతున్నారు. అగ్ని మాపక సిబ్బంది ఇంకా సంఘటన స్థలానికి చేరుకోలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: పాతబస్తీ లాల్ దర్వాజ బోనాలు ప్రారంభం..