AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మెట్రో కార్యక్రమానికి నన్ను ఆహ్వానించరా ‘? నిప్పులు కక్కిన దీదీ

కోల్ కతాలో ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ లాంచ్ కార్యక్రమానికి బీజేపీ నేతలు తనను ఆహ్వానించకపోవడాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తప్పు పట్టారు. నిజానికి ఈ ప్రాజెక్టుకు కేంద్ర ఆమోదం లభించేలా చూసేందుకు తాను, తన సహచరులు ఎంతో  శ్రమించామని ఆమె చెప్పారు. నేను రైల్వే మంత్రిగా ఉండగా.. దీని అప్రూవల్ కోసం దాదాపు కన్నీటి పర్యంతం కూడా అయ్యానన్నారు. ఈ నెల 13 న ఈ కారిడార్ ను కేంద్ర మంత్రి పీయూష్ […]

'మెట్రో కార్యక్రమానికి నన్ను ఆహ్వానించరా '? నిప్పులు కక్కిన దీదీ
Umakanth Rao
| Edited By: |

Updated on: Feb 15, 2020 | 2:49 PM

Share

కోల్ కతాలో ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ లాంచ్ కార్యక్రమానికి బీజేపీ నేతలు తనను ఆహ్వానించకపోవడాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తప్పు పట్టారు. నిజానికి ఈ ప్రాజెక్టుకు కేంద్ర ఆమోదం లభించేలా చూసేందుకు తాను, తన సహచరులు ఎంతో  శ్రమించామని ఆమె చెప్పారు. నేను రైల్వే మంత్రిగా ఉండగా.. దీని అప్రూవల్ కోసం దాదాపు కన్నీటి పర్యంతం కూడా అయ్యానన్నారు.

ఈ నెల 13 న ఈ కారిడార్ ను కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ ప్రారంభించారు. దీనికి మర్యాదపూర్వకంగానైనా నన్ను ఆహ్వానించలేదని మమతా బెనర్జీ శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. 2009-2011 మధ్య కాలంలో ఆమె రైల్వే మంత్రిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. గురువారం ఈ ప్రాజెక్టును ప్రారంభించిన పీయూష్ గోయెల్..ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి కిసాన్ యోజన వంటి కేంద్ర పథకాల వల్ల కలిగే ప్రయోజనాలను ఈ రాష్ట్ర ప్రజలు పొందకుండా వారి హక్కును ఈ ప్రభుత్వం కాలరాచిందని ఆరోపించారు. ఈ రాష్ట్రానికి ఎన్నో ప్రాజెక్టులను అందించదలచామని, కానీ ప్రభుత్వం వీటిని అనుమతించకుండా అడ్డుకుంటోందని ఆయన విమర్శించారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా దేశంలో కోటిమంది ప్రజలు లబ్ది పొందుతున్నారు అని ఆయన చెప్పారు. అయితే దీదీవీటిని ఖండిస్తూ.. ప్రజలకు ప్రయోజనం కలిగించే మెట్రో వంటి ప్రాజెక్టుల విషయంలో తమ ప్రభుత్వాన్ని పక్కనపెట్టి బీజేపీ రాజకీయంగా ప్రయోజనం పొందాలని చూస్తోందని తిప్పికొట్టారు.

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్