AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

25 వ రోజుకు చేరిన రైతుల నిరసన, ఢిల్లీ-యూపీ మధ్య ఘాజీపూర్ సరిహద్దును ఆక్రమిస్తాం, అన్నదాతల హెచ్చరిక

రైతు చట్టాలను రద్దు చేయాలంటూ సింఘు బోర్డర్ లో అన్నదాతలు చేస్తున్న ఆందోళనఆదివారం నాటికి 25 వ రోజుకు చేరుకుంది. ఢిల్లీ-యూపీ మధ్య ఘాజీపూర్ బోర్డర్ ను..

25 వ రోజుకు చేరిన రైతుల నిరసన, ఢిల్లీ-యూపీ మధ్య ఘాజీపూర్ సరిహద్దును ఆక్రమిస్తాం, అన్నదాతల హెచ్చరిక
Umakanth Rao
| Edited By: |

Updated on: Dec 20, 2020 | 12:32 PM

Share

రైతు చట్టాలను రద్దు చేయాలంటూ సింఘు బోర్డర్ లో అన్నదాతలు చేస్తున్న ఆందోళనఆదివారం నాటికి 25 వ రోజుకు చేరుకుంది. ఢిల్లీ-యూపీ మధ్య ఘాజీపూర్ బోర్డర్ ను తాము ఆక్రమిస్తామని రైతు సంఘాలు హెచ్చరించాయి.  నిరసన సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన రైతులకు సంతాపంగా దేశవ్యాప్తంగా శ్రధ్ధాంజలి ఘటిస్తామని ఈ సంఘాలు పేర్కొన్నాయి. గ్రామ, బ్లాకు స్థాయిలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు  శ్రధ్ధాంజలి దివస్ కార్యక్రమాన్ని పాటిస్తామని స్పష్టం చేశాయి. కాగా తమ ఆందోళనతో ఏ రాజకీయపార్టీకీ సంబంధం లేదని ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కో-ఆర్డినేషన్ కమిటీ ప్రధాని మోదీకి, వ్యవసాయ శాఖ ,మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కు సుదీర్ఘ లేఖ రాసింది. తమ ఆందోళనను ప్రతిపక్షాలు రెచ్ఛగొడుతున్నాయని, తమ నిరసన వెనుక వారి హస్తం ఉందని మోదీ, బీజేపీ నేతలు ఆరోపించడాన్ని ఈ కమిటీ ఖండించింది.

ఇది తప్పుడు అభిప్రాయమని, తమ ప్రొటెస్ట్ వెనుక ఈ పార్టీ  కూడా లేదని స్పష్టం చేసింది.  మా రైతుల్లో ఏ యూనియన్ కి గానీ, చిన్న, లేదా పెద్ద సంఘానికి గానీ ఏ పొలిటికల్ పార్టీ తో సంబంధం లేదు. ఈ విషయాన్ని గ్రహించండి అని ఈ కమిటీ నేతలు పేర్కొన్నారు. కేంద్రం తెచ్చిన మూడు చట్టాల్లో ఎన్నో లొసుగులు ఉన్నాయని, ప్రధాన సమస్యలనుంచి రైతుల దృష్టిని మళ్లించడానికి మీరు యత్నిస్తున్నారని తోమర్ కు రాసిన లేఖలో వీరు ఆరోపించారు. అటు-హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ నిన్న తోమర్ తో భేటీ అయ్యారు. రెండు మూడు రోజుల్లో మళ్ళీ చర్చలు జరిగే అవకాశం ఉందని ఆయన ఆ తరువాత చెప్పారు.

Follow Us
ఆ ఒక్క సీన్.. దెబ్బకు లైఫ్ మారిపోయింది..
ఆ ఒక్క సీన్.. దెబ్బకు లైఫ్ మారిపోయింది..
రైతులకు ఇది కదా కావాల్సింది.. ఎన్నో ఏళ్ల సమస్యకు రేవంత్ సర్కార్..
రైతులకు ఇది కదా కావాల్సింది.. ఎన్నో ఏళ్ల సమస్యకు రేవంత్ సర్కార్..
చికెన్, మటన్‎ను మైమరిపించే పచ్చి బొప్పాయి కూర..
చికెన్, మటన్‎ను మైమరిపించే పచ్చి బొప్పాయి కూర..
యూవర్ అటెన్షన్ ప్లీజ్.. ట్రాఫిక్ చలాన్లపై బిగ్ అప్‌డేట్..
యూవర్ అటెన్షన్ ప్లీజ్.. ట్రాఫిక్ చలాన్లపై బిగ్ అప్‌డేట్..
నాణెంపై చిన్న గుర్తు..పెద్ద సీక్రెట్! ఎక్కడ తయారైందో ఇలా తెలుసుకో
నాణెంపై చిన్న గుర్తు..పెద్ద సీక్రెట్! ఎక్కడ తయారైందో ఇలా తెలుసుకో
రెండో టైటిల్‌పై కన్నేసిన గుజరాత్.. ట్రోఫీ అందించే X-ఫ్యాక్టర్స్
రెండో టైటిల్‌పై కన్నేసిన గుజరాత్.. ట్రోఫీ అందించే X-ఫ్యాక్టర్స్
ఓటీటీలోకి వచ్చేసిన రూ.460 కోట్లు బ్లాక్ బస్టర్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన రూ.460 కోట్లు బ్లాక్ బస్టర్ హిట్ మూవీ..
శ్రీరామనవమి నుంచి.. వీరి దశ తిరిగినట్టే.. మీరున్నారా?
శ్రీరామనవమి నుంచి.. వీరి దశ తిరిగినట్టే.. మీరున్నారా?
మహిళలకు ప్రతి నెలా రూ.2500.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..!
మహిళలకు ప్రతి నెలా రూ.2500.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..!
కవిత కొత్త పార్టీపై క్లారిటీ.. మూహూర్తం ఖరారు! కసరత్తు ముమ్మరం..
కవిత కొత్త పార్టీపై క్లారిటీ.. మూహూర్తం ఖరారు! కసరత్తు ముమ్మరం..