భారీగా పెరగనున్న ‘కాళేశ్వరం’ ప్రాజెక్ట్ వ్యయం

| Edited By: Srinu

Apr 18, 2019 | 7:34 PM

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యయం భారీగా పెరగనుంది. దాదాపుగా మరో 20 వేల కోట్లు పెరుగుతోందని తెలుస్తోంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడానికి అయ్యే ఖర్చు లక్ష కోట్లు దాటుతోందని ఇరిగేషన్ శాఖ వర్గాలు అంటున్నాయి. గోదావరి నుంచి 160 టీఎంసీల నీటిని ఎత్తి పోసేందుకు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకూ నీటి లభ్యత ఉన్న సమయంలో రోజుకు రెండు టీఎంసీల నీటిని తరలించేందుకు ఈ ప్రాజెక్టును రీ డిజైన్ […]

భారీగా పెరగనున్న ‘కాళేశ్వరం’ ప్రాజెక్ట్ వ్యయం
Follow us on

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యయం భారీగా పెరగనుంది. దాదాపుగా మరో 20 వేల కోట్లు పెరుగుతోందని తెలుస్తోంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడానికి అయ్యే ఖర్చు లక్ష కోట్లు దాటుతోందని ఇరిగేషన్ శాఖ వర్గాలు అంటున్నాయి. గోదావరి నుంచి 160 టీఎంసీల నీటిని ఎత్తి పోసేందుకు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకూ నీటి లభ్యత ఉన్న సమయంలో రోజుకు రెండు టీఎంసీల నీటిని తరలించేందుకు ఈ ప్రాజెక్టును రీ డిజైన్ చేశారు. దీనికి అనుగుణంగా వర్షాకాలంలో రోజుకు రెండు టీఎంసీల చొప్పున 160 టీఎంసీల నీటిని ఎత్తి పోస్తారు. ఎత్తిపోసిన నీటిలో 140 టీఎంసీలు నిల్వ చేసేందుకు చిన్నవి, పెద్దవి కలిపి 20 రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. మిగిలిన 13 టీఎంసీలతో చెరువులు నింపాలని ప్లాన్ చేశారు.