కశ్మీర్​ అధికార యంత్రాంగం కీలక నిర్ణయం, డిసెంబర్​ 31వరకు విద్యాసంస్థలు బంద్​, మరికొన్ని కీలక ఆదేశాలు

|

Nov 30, 2020 | 10:49 AM

జమ్ముకశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ​  డిసెంబర్​ 31 వరకు అన్ని రకాల విద్యా సంస్థలు మూసే ఉంటాయని ప్రకటించింది.

కశ్మీర్​ అధికార యంత్రాంగం కీలక నిర్ణయం, డిసెంబర్​ 31వరకు విద్యాసంస్థలు బంద్​, మరికొన్ని కీలక ఆదేశాలు
Follow us on

జమ్ముకశ్మీర్ అధికార యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ​  డిసెంబర్​ 31 వరకు అన్ని రకాల విద్యా సంస్థలు మూసే ఉంటాయని ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. అయితే.. 9 నుంచి 12 వ తరగతికి చెందిన విద్యార్థులు స్వచ్ఛందంగా స్కూల్స్‌కు రావొచ్చని తెలిపింది. ఆన్​లైన్​ విద్యను యథావిధిగా కొనసాగించవచ్చని జమ్ముకశ్మీర్​ యంత్రాంగం తెలిపింది. ఇక ఉత్తర్వుల్లో మరికొన్ని కీలక అంశాలు పొందుపరిచారు.

థియేటర్లను 50శాతం సామర్థ్యంతో తెరుచుకోవచ్చని పేర్కొన్నారు. వివాహ వేడుకల్లో 100 మంది అతిథులు మాత్రమే పాల్గొనాలని, ఆన్​లైన్​ విద్య కోసం పాఠశాలలకు ఉపాధ్యాయ, ఉపాధ్యేయతర సిబ్బంది 50 శాతం వరకు హాజరుకావచ్చని సూచించారు. శాస్త్ర, సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న పీజీ, రీసెర్చ్​ స్కాలర్స్​ విద్యార్థులు తమ విద్యాసంస్థల్లో ప్రయోగశాలల కోసం హాజరుకావచ్చని వివరించారు. ప్రార్థన మందిరాలు తెరిచే ఉంటాయి. కానీ, భారీ సంఖ్యలో జనంతో ప్రేయర్ మీటింగ్స్ నిర్వహించడానికి వీల్లేదని సూచించారు.

Also Read :

AP Assembly : నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..అస్త్రశస్త్రాలతో అధికార, ప్రతిపక్షాలు రెడీ !

Ind vs Aus : రెండో వన్డే​లో క్రేజీ సీన్, ఆసిస్ లేడీ ఫ్యాన్‌కు ప్రపోజ్ చేసిన ఇండియా కుర్రోడు